రమదాన్: పిలిగ్రిమ్స్ కోసం ఎమర్జన్సీ టీమ్స్
- May 10, 2018
మక్కా: అత్యవసర పరిస్థితుల్లో ఉమ్రా పిలిగ్రిమ్స్ అలాగే విజిటర్స్కి గ్రాండ్ మాస్క్ వద్ద సేవలందించేందుకోసం రమదాన్ పవిత్ర మాసంలో ప్రత్యేకంగా టీమ్స్ ఏర్పాటు చేశారు. మక్కా డిప్యూటీ ఎమిర్, ప్రిన్స్ అబ్దుల్లా బిన్ బందర్ ఈ మేరకు ఓ డైరెక్టివ్ని విడుదల చేశారు. అబ్దుల్లా బిన్ బందర్, సెంట్రల్ హజ్ కమిటీకి డిప్యూటీ ఛైర్మన్గా వ్యవహరిస్తున్న సంగతి తెల్సిందే. ప్రిన్స్ అబ్దుల్లా, గ్రాండ్ మాస్క్ని సందర్శించి, అక్కడ ఏర్పాట్లను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. సెక్యూరిటీ ఫోర్సెస్ని అడిగి సమాచారాన్ని సేకరించిన ప్రిన్స్, భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని వారికి సూచించారు. రమదాన్ సందర్భంగా పెద్దయెత్తున యాత్రీకులు గ్రాండ్ మాస్క్కి వచ్చే అవకాశం వున్నందున, ఎలాంటి అనుకోని ఘటనలకూ తావివ్వకూడదని ఆదేశించారు ప్రిన్స్.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









