రమదాన్: పిలిగ్రిమ్స్ కోసం ఎమర్జన్సీ టీమ్స్
- May 10, 2018మక్కా: అత్యవసర పరిస్థితుల్లో ఉమ్రా పిలిగ్రిమ్స్ అలాగే విజిటర్స్కి గ్రాండ్ మాస్క్ వద్ద సేవలందించేందుకోసం రమదాన్ పవిత్ర మాసంలో ప్రత్యేకంగా టీమ్స్ ఏర్పాటు చేశారు. మక్కా డిప్యూటీ ఎమిర్, ప్రిన్స్ అబ్దుల్లా బిన్ బందర్ ఈ మేరకు ఓ డైరెక్టివ్ని విడుదల చేశారు. అబ్దుల్లా బిన్ బందర్, సెంట్రల్ హజ్ కమిటీకి డిప్యూటీ ఛైర్మన్గా వ్యవహరిస్తున్న సంగతి తెల్సిందే. ప్రిన్స్ అబ్దుల్లా, గ్రాండ్ మాస్క్ని సందర్శించి, అక్కడ ఏర్పాట్లను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. సెక్యూరిటీ ఫోర్సెస్ని అడిగి సమాచారాన్ని సేకరించిన ప్రిన్స్, భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని వారికి సూచించారు. రమదాన్ సందర్భంగా పెద్దయెత్తున యాత్రీకులు గ్రాండ్ మాస్క్కి వచ్చే అవకాశం వున్నందున, ఎలాంటి అనుకోని ఘటనలకూ తావివ్వకూడదని ఆదేశించారు ప్రిన్స్.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం