రమదాన్: పిలిగ్రిమ్స్ కోసం ఎమర్జన్సీ టీమ్స్
- May 10, 2018
మక్కా: అత్యవసర పరిస్థితుల్లో ఉమ్రా పిలిగ్రిమ్స్ అలాగే విజిటర్స్కి గ్రాండ్ మాస్క్ వద్ద సేవలందించేందుకోసం రమదాన్ పవిత్ర మాసంలో ప్రత్యేకంగా టీమ్స్ ఏర్పాటు చేశారు. మక్కా డిప్యూటీ ఎమిర్, ప్రిన్స్ అబ్దుల్లా బిన్ బందర్ ఈ మేరకు ఓ డైరెక్టివ్ని విడుదల చేశారు. అబ్దుల్లా బిన్ బందర్, సెంట్రల్ హజ్ కమిటీకి డిప్యూటీ ఛైర్మన్గా వ్యవహరిస్తున్న సంగతి తెల్సిందే. ప్రిన్స్ అబ్దుల్లా, గ్రాండ్ మాస్క్ని సందర్శించి, అక్కడ ఏర్పాట్లను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. సెక్యూరిటీ ఫోర్సెస్ని అడిగి సమాచారాన్ని సేకరించిన ప్రిన్స్, భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని వారికి సూచించారు. రమదాన్ సందర్భంగా పెద్దయెత్తున యాత్రీకులు గ్రాండ్ మాస్క్కి వచ్చే అవకాశం వున్నందున, ఎలాంటి అనుకోని ఘటనలకూ తావివ్వకూడదని ఆదేశించారు ప్రిన్స్.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









