నేపాల్ పర్యటనలో భారత్ ప్రధాని మోదీ
- May 10, 2018
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం ఢిల్లీలోని పాలం ఎయిర్ పోర్టు నుండి నేపాల్ బయలుదేరారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన నేపాల్లోని పలు ప్రాంతాలు సందర్శించనున్నారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు సహాయ సహకారాలు అందించుకోవడానికి ఈ పర్యటన దోహదపడుతుందని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు.
"సబ్కా సాత్.. సబక్ వికాస్" సూత్రాన్ని అనుసరించి సరిహద్దు దేశాల అభివృద్దిని కూడా కాంక్షిస్తూ పలు ఒప్పందాలు చేసుకోవడానికి మోదీ ఈ పర్యటనకు శ్రీకారం చుట్టారని ఈ సందర్భంగా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సమృద్ది నేపాల్... సుఖీ నేపాల్ అనే నినాదంతో ముందుకు పోతున్న నేపాల్ అభివృద్దిలో సరిహద్దు దేశంగా భారత్ కూడా తగిన పాత్ర పోషిస్తుందని శాఖ ప్రకటించింది
ఈ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలితో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఆ తర్వాత భారత ప్రధాని ఇరు దేశాల మధ్య కొత్తగా ఏర్పాటు చేస్తున్న జనక్ పూర్ - అయోధ్య బస్ సర్వీసును ప్రారంభిస్తారు. అదేవిధంగా నేపాల్లో స్వదేశీ దర్శన పథకంలో భాగంగా రామాయణ సర్క్యూట్ను కూడా ప్రారంభిస్తారు.
ముఖ్యంగా నేపాల్ దేశంలో హిందూ మతవ్యాప్తి కోసం అక్కడి పర్యాటక శాఖ సహకారంతో ఈ సర్క్యూట్కు నాంది పలికినట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఈ పర్యటనలో భాగంగా మోదీ ముక్తినాథ్, ఖాట్మండులోని పశుపతినాథ్ ఆలయాన్ని కూడా సందర్శి్స్తారు. అలాగే ఖాట్మండు మేయర్ ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక విందులో కూడా పాల్గొంటారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









