పాకిస్థాన్‌లో భారీ పేలుడు..5 మంది మృతి

- May 10, 2018 , by Maagulf
పాకిస్థాన్‌లో భారీ పేలుడు..5 మంది మృతి

పాకిస్థాన్‌:పాకిస్థాన్‌లోని పెషావర్ పట్టణంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఐదుగురు కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయపడ్డారు. బిలాల్ టౌన్‌లోని హోటల్ నాలుగవ అంతస్థులో సంభవించిన పేలుడులో గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. హోటల్‌లో గ్యాస్ లీకేజీ అవడం వల్లే పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. భద్రతా దళాలు బాంబు తనిఖీ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని పేలుడు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com