దుబాయ్ వెళ్లినరోజే అదృశ్యం...
- May 11, 2018
తెలంగాణ:యు.ఏ.ఈ దేశంపోయి బాగా సంపదించుకోని వచ్చి భార్యపిల్లలతో ఆనందంగా గుడుపుదామని తెలిసిన వాళ్ల దగ్గర అ ప్పు చేసి మరీ దుబాయ్కి వెళ్లిన 24గంటల్లోపే అదృశ్యమయ్యాడు కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన మంగళి యాదగిరి. మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన మంగళి యాదగిరి జూలై 18-2015న దుబాయ్కి కంపెనీ వీసాపై వెళ్లాడు. అక్కడి దుబాయ్ విమానాశ్రయంలో దిగగానే సోనాపూర్ ఏరియాలో అక్కడి ఏజెంట్ రూంకు తీసుకెళ్లాడని, రూంకు వెళ్లగానే తన కుటుంబసభ్యులకు ఫోన్చేసి' నేను బాగానే ఉన్న విమానాశ్రయం నుండి సోనాపూర్ ఏరియా లోని రూంకు ఏజెంట్ తీసుకొచ్చాడని మీరు నా గురించి దిగులు పడ్డొద్దు అంటు యాదగిరి కు టుంబసభ్యులతో మాట్లాడాడు' అక్కడి వరకు బాగానే ఉన్న దుబాయ్కి వెళ్లి రూంలోకి వెళ్లిన తర్వాత మాట్లాడిన మాటనే చివరివి. అప్పటి నుండి ఇప్పటివరకు యాదగిరి ఎక్కడున్నాడో ఏమయ్యాడో తెలియదు. ఏజెంట్లకు అడిగితే రూంలో నుండి ఎక్కడికి వెళ్లాడో తెలియదు అం టు సమాధానం చెబుతున్నారని కుటుంబస భ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా మూడు సంవత్సరాలు గడుస్తున్న అసలు యా దగిరి ఏం చేస్తున్నాడో ఏమయ్యాడో ఇప్పటికీ సమాచారం లేదు.
యాదగిరి కోసం తన అన్న నర్సింలు ఏజెంట్లు, మంత్రుల వద్దకు తిరిగిన సరైనా స్పందన లేదని దీంతో సొంతఖర్చులతో తానే దుబాయ్లోని అ న్ని జైళ్లు, దుబాయ్లో తెలుగువారి వద్ద వెతికి నా యాదగిరి ఆచూకీ దొరకలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి నుంచి ఎక్కడ తిరిగిన ఫలితం లేదని ప్రజాప్రతినిధులు గానీ, అధికారులు గానీ, గల్ఫ్లోని తెలుగువాళ్లు గానీ యా దగిరి ఆచూకీ కోసం చర్యలు తీసుకోవాలని కు టుంబసభ్యులు, గ్రామస్థులు కోరుతున్నారు.
నాభర్త ఆచూకీ తెలపండి..
నా భర్త యాదగిరి 2015 జూలై నెలలో దుబాయ్కి కంపెనీ వీసాపై వెళ్లాడు.దుబాయ్ విమానాశ్రయంలో దిగగానే సోనాపూర్ ఏరియాలో అక్కడి ఏజెంట్ రూంకు తీసుకెళ్లాడని చెప్పి మాట్లాడిన మాటలే చివరివి. అప్పటినుండి ఇప్పటివరకు నా భర్తనాతో కానీ మా కుటుంబసభ్యులతో కానీ మాట్లాడలేదు. ఏజెంట్ల దగ్గరికి తిరిగి న, నాయకుల వద్దకు తిరిగిన స్పందించడం లేదు. నేను బీడీలు చేస్తూ ఉన్న ఒక్క గానొక కొడుకును చదివిస్తూ బ్రతుకుతున్నానని, ఎప్పటికైనా నాభర్త జాడ తెలుస్తుం దన్న ఆశ ఉంది.నా కొడుకు బాధ, నాన్న బాధ చూసైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి అక్కడి అధికారులతో చర్చించి నా భర్త జాడకోసం చర్యలు తీసుకోవాలి.
-భాగ్యలక్ష్మీ,యాదగిరిభార్య
యాదగిరి కోసం వెతుకుతున్నాం..
యాదగిరి విషయం మాకు తెలియగానే అతని ఆచూకీ కోసం తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్, కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చర్యలు ప్రారంభించాం. అసలు యాదగిరి ఎమయ్యాడు.. ఎక్కడున్నడు.. అనే విషయంపై అక్కడి అధికారులతో మాట్లాతూ ప్రయత్నాలు ముమ్మరం చేశాం. యాదగిరి గురించి తెలియదంటున్న ఇక్కడి, గల్ఫ్ ఏజెంట్లపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి విన్నవించాం. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.ఎప్పటికైనా యాదగిరి ఆచూకీ లభిస్తుందన్న ఆశ ఉంది.
-బసంత్రెడ్డి, తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్, కల్చరల్ అసోసియేషన్ అధికార ప్రతినిధి
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







