సినిమా రచయిత సూసైడ్ అటెంప్ట్పై క్లారిటీ..
- May 18, 2018
ప్రముఖ రచయిత, దర్శకుడు రాజసింహం ముంబైలోని తన ఫ్లాట్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. 'రుద్రమదేవి' సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రకు డైలాగులు రాశాడు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన 'ఒక అమ్మాయి తప్ప' సినిమాతో దర్శకుడిగా మారారు. రాజసింహా ఆశించిన స్థాయిలో ఈ మూవీ విజయం సాధించింలేకపోవడంతో ఆయనకు అవకాశాలు తగ్గాయని.. దీంతో ఆయన డిప్రెషన్లోకి వెళ్లినట్టు వదంతలు వినిపించాయి. ఈయనకు ఇప్పుడు సినిమాలో ఆవకాశాలు లేని కారణంగా తన నివాసంలో నిద్రమాత్రలు మింగారని సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై రాజసింహా క్లారిటీ ఇచ్చారు. తనకు మధుమేహం ఉండటం వల్ల ఒక్కసారిగా షుగర్ లెవల్స్ పడిపోయాయి అని తెలిపారు. దీంతో ఆయనకు ఆయాసం వచ్చి పడిపోయారట. కొద్దిసేపటి తర్వాత వాళ్ల కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారట. ఇప్పుడు ఆయన హెల్త్ కండిషన్ బాగానే ఉందని.. మూడు రోజుల్లో హైదరాబాద్ వచ్చి అన్ని విషయాలు చెబుతానని రాజసింహా తెలిపారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







