సినిమా రచయిత సూసైడ్ అటెంప్ట్పై క్లారిటీ..
- May 18, 2018ప్రముఖ రచయిత, దర్శకుడు రాజసింహం ముంబైలోని తన ఫ్లాట్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. 'రుద్రమదేవి' సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రకు డైలాగులు రాశాడు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన 'ఒక అమ్మాయి తప్ప' సినిమాతో దర్శకుడిగా మారారు. రాజసింహా ఆశించిన స్థాయిలో ఈ మూవీ విజయం సాధించింలేకపోవడంతో ఆయనకు అవకాశాలు తగ్గాయని.. దీంతో ఆయన డిప్రెషన్లోకి వెళ్లినట్టు వదంతలు వినిపించాయి. ఈయనకు ఇప్పుడు సినిమాలో ఆవకాశాలు లేని కారణంగా తన నివాసంలో నిద్రమాత్రలు మింగారని సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై రాజసింహా క్లారిటీ ఇచ్చారు. తనకు మధుమేహం ఉండటం వల్ల ఒక్కసారిగా షుగర్ లెవల్స్ పడిపోయాయి అని తెలిపారు. దీంతో ఆయనకు ఆయాసం వచ్చి పడిపోయారట. కొద్దిసేపటి తర్వాత వాళ్ల కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారట. ఇప్పుడు ఆయన హెల్త్ కండిషన్ బాగానే ఉందని.. మూడు రోజుల్లో హైదరాబాద్ వచ్చి అన్ని విషయాలు చెబుతానని రాజసింహా తెలిపారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..