సినిమా రచయిత సూసైడ్ అటెంప్ట్పై క్లారిటీ..
- May 18, 2018
ప్రముఖ రచయిత, దర్శకుడు రాజసింహం ముంబైలోని తన ఫ్లాట్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. 'రుద్రమదేవి' సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రకు డైలాగులు రాశాడు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన 'ఒక అమ్మాయి తప్ప' సినిమాతో దర్శకుడిగా మారారు. రాజసింహా ఆశించిన స్థాయిలో ఈ మూవీ విజయం సాధించింలేకపోవడంతో ఆయనకు అవకాశాలు తగ్గాయని.. దీంతో ఆయన డిప్రెషన్లోకి వెళ్లినట్టు వదంతలు వినిపించాయి. ఈయనకు ఇప్పుడు సినిమాలో ఆవకాశాలు లేని కారణంగా తన నివాసంలో నిద్రమాత్రలు మింగారని సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై రాజసింహా క్లారిటీ ఇచ్చారు. తనకు మధుమేహం ఉండటం వల్ల ఒక్కసారిగా షుగర్ లెవల్స్ పడిపోయాయి అని తెలిపారు. దీంతో ఆయనకు ఆయాసం వచ్చి పడిపోయారట. కొద్దిసేపటి తర్వాత వాళ్ల కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారట. ఇప్పుడు ఆయన హెల్త్ కండిషన్ బాగానే ఉందని.. మూడు రోజుల్లో హైదరాబాద్ వచ్చి అన్ని విషయాలు చెబుతానని రాజసింహా తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







