సినిమా రచయిత సూసైడ్ అటెంప్ట్పై క్లారిటీ..
- May 18, 2018
ప్రముఖ రచయిత, దర్శకుడు రాజసింహం ముంబైలోని తన ఫ్లాట్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. 'రుద్రమదేవి' సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రకు డైలాగులు రాశాడు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన 'ఒక అమ్మాయి తప్ప' సినిమాతో దర్శకుడిగా మారారు. రాజసింహా ఆశించిన స్థాయిలో ఈ మూవీ విజయం సాధించింలేకపోవడంతో ఆయనకు అవకాశాలు తగ్గాయని.. దీంతో ఆయన డిప్రెషన్లోకి వెళ్లినట్టు వదంతలు వినిపించాయి. ఈయనకు ఇప్పుడు సినిమాలో ఆవకాశాలు లేని కారణంగా తన నివాసంలో నిద్రమాత్రలు మింగారని సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై రాజసింహా క్లారిటీ ఇచ్చారు. తనకు మధుమేహం ఉండటం వల్ల ఒక్కసారిగా షుగర్ లెవల్స్ పడిపోయాయి అని తెలిపారు. దీంతో ఆయనకు ఆయాసం వచ్చి పడిపోయారట. కొద్దిసేపటి తర్వాత వాళ్ల కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారట. ఇప్పుడు ఆయన హెల్త్ కండిషన్ బాగానే ఉందని.. మూడు రోజుల్లో హైదరాబాద్ వచ్చి అన్ని విషయాలు చెబుతానని రాజసింహా తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







