తమిళనాడు వరద బాధితులకు యూఏఈ ఇండియన్స్‌ విరాళం

- December 07, 2015 , by Maagulf
తమిళనాడు వరద బాధితులకు యూఏఈ ఇండియన్స్‌ విరాళం

కేరళ ముస్లిం కల్చరల్‌ సెంటర్‌ (కెఎంసిసి) వరదలతో విలవిల్లాడిన తమిళనాడుకు సహాయం అందించేందుకు ఓ ఛానిటీ ప్రోగ్రామ ప్రారంభించింది. కెఎంసిసి ప్రెసిడెంట్‌ అన్వర్‌ నహా మాట్లాడుతూ, తమిళనాడు ముస్లిం లీగ్‌ కమిటీతో సంప్రదింపులు జరిపి సహాయక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించింది. అసోసియేషన్‌ సభ్యులు, మరియు సన్నిహితులు ఒక రోజు జీతాన్ని తమిళనాడు వరద బాధితుల కోసం అందజేయనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించే విరాళాలకు కమిషన్‌ నుంచి మినహాయింపునిస్తున్నట్లు యూఏఈ ఎక్స్‌ఛేంజ్‌ వెల్లడించింది. ఇదిలా ఉండగా, వరదల కారణంగా మూసివేయబడిన చెన్నయ్‌ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి. తమిళనాడు వరదల్లో వేలాది మంది నిరాశ్రయులు కాగా, రాజధాని చెన్నయ్‌లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఇప్పుడిప్పుడే చెన్నయ్‌ కోలుకుంటోంది. 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com