బెడిసికొట్టిన యడ్యూరప్ప వ్యూహాలు
- May 19, 2018
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేశారు. మెజార్టీ లేకపోవడంతో యడ్డీ దిగక తప్పలేదు. మోడీ, అమిత్ షాలు వ్యూహాలు పన్నినా అవి విఫలమయ్యాయి. మెజార్టీ లేకున్నా ప్రభుత్వ ఏర్పాటుకు పాకులాడారు. చివరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బలనిరూపణ జరిగితే భంగపాటు తప్పదని భయపడడంతో గౌరవంగా రాజీనామా చేయడానికే మొగ్గు చూపారు. మెజార్టీ రాకున్నా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడంపై తీవ్రమైన విమర్శలొచ్చాయి. అయినా యడ్యూరప్ప సీఎం అయిన ప్రతీసారీ వివాదాలే! ఎమ్మెల్యేలతో బీజేపీ రాయబారాలు బెడిసికొట్టాయి. ఎమ్మెల్యేల బేరసారాల టేపులను కాంగ్రెస్ విడుదల చేసింది. ఆడియో టేపుల విడుదలతో బీజేపీలో కలకలం రేగింది. దేశవ్యాప్తంగా పార్టీ ప్రతిష్ట దిగజారుతుందని భయపడింది.
పార్టీకి అప్రదిష్ట తేవద్దంటూ అధిష్టానం ఆదేశించింది. వైరిపక్షాల ఎమ్మెల్యేలను బీజేపీ బెదిరించిందంటూ ఆరోపణలు కూడా వచ్చాయి. అయినా సంఖ్యాబలంపై మొదటి నుంచి బీజేపీలో ఆందోళన నెలకొంది. అమిత్ షా స్కెచ్ లు ఘోరంగా విఫలమయ్యాయి. ఇటు యడ్యూరప్ప.. ముహూర్తం చూసి మరీ ప్రమాణం చేసినా ఫలితం లేకపోయింది. కర్ణాటక ఫలితాలను కలలో కూడా బీజేపీ ఊహించలేదు. దీంతో దక్షిణాదిన ఇప్పట్లో అడుగుపెట్టే అవకాశాన్ని కోల్పోయింది.
తాజా వార్తలు
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..







