సింగపూర్ లో అన్నమయ్య జయంతి ఉత్సవాలు
- May 20, 2018
సింగపూర్:సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యం లో "తొలి తెలుగు పద కవితా పితామహుడు" శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల జయంతి వేడుకలు స్థానిక శారదా హాల్, రామకృష్ణ మిషన్ నందు ఘనంగా జరిగాయి. సాంప్రదాయబద్ధంగా ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించబడిన ఈ ఉత్సవంలో సింగపూర్ లో నివసిస్తున్న వందలాది ప్రవాస తెలుగువారు పాల్గొని,సామూహికంగా సప్తగిరి సంకీర్తనలను ఆలపించారు .అన్నమయ్య సంకీర్తనలకు సంభందించి విశేష కృషిచేసిన 'పద్మశ్రీ' డా. శోభారాజు గారు ముఖ్య అతిధి గా విచ్చేసి, అన్నమయ్య మరియు ఆయన సంకీర్తనల గురించి ఉపన్యసించి, కొన్ని సంకీర్తనలను ఆలపించారు. ఈ సందర్భంగా శోభారాజు గారు మాట్లాడుతూ, ఈ విధంగా అన్నమయ్య జయంతి సింగపూర్ లో తొలిసారిగా జరగడం ఎంతో ఆనందాన్నిచ్చిందని, తెలుగు సంస్కృతి ,సాంప్రదాయాల పై సింగపూర్ తెలుగు సమాజము నకు ఉన్న భక్తి, శ్రద్ద ల వలనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రశంసించారు. ప్రత్యేక అతిధి గా రామకృష్ణ మిషన్ అధ్యక్షులు స్వామి విమోక్షానంద విచ్చేసి తమ సందేశాన్నందంచారు.ఈ కార్యక్రమంలో భాగంగా ముప్పైమూడుకోట్ల దేవతలకు ఆలవాలమైన గోవు మరియు గోపంచగవ్య మహాశక్తి యొక్క విశిష్ఠత గురించి శ్రీ వడ్డి కృషి గారు వివరించారు. కార్యక్రమానంతరం అన్నప్రసాద వితరణ జరుపబడింది.
సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ వినోదభరితం మరియు మనోరంజకమైన కార్యక్రమాలే కాకుండా, ఆ భగవంతుని మీద పూర్తి భక్తి శ్రద్ధలతో భక్తి ప్రధానమైన ఉగాది పూజ వంటి కార్యక్రమాలు చేసామని , ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి, ఆ భగవన్నామస్మరణకి తన జీవితం అంకితం చేసి, తనదైన శైలి లో ఆ శ్రీనివాసుని సంకీర్తనలను రచించి ఆలపించిన మన తెలుగు కవి అన్నమయ్య జన్మదిన మహోత్సవం జరుపుకోవడం మన అదృష్టమన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినవారికి, వాయుద్య మరియు గాత్రసహకారమందించిన ప్రతి ఒక్కరికీ ప్రాంతీయ కార్యదర్శి అనిల్ పోలిశెట్టి కృతజ్ఞతలను తెలిపారు. ఈకార్యక్రమం విజయవంతము కావడానికి శ్రమ్రించిన కార్యవర్గసభ్యులు ప్రదీప్, సుందర్, జ్యోతీశ్వర్, మల్లిక్, ప్రసాద్ లకు మరియు దాతలకు కార్యదర్శి సత్య చిర్ల దన్యవాదాలు తెలిపారు.




తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









