నవలారాణి యద్దనపూడి సులోచనా రాణి కన్నుమూత

- May 20, 2018 , by Maagulf
నవలారాణి యద్దనపూడి సులోచనా రాణి కన్నుమూత

నవలారాణి యద్దనపూడి  సులోచనా రాణి కన్నుమూసారు. కొంతకాలంగా కాలిఫోర్నియాలో ఉంటున్న ఆమె అనారోగ్య కారణాలతో అక్కడే కన్నుమూశారు. రచయిత్రగా తనదైన ముద్రవేసి.. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఆమె మరణం తెలుగు ప్రజలకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించేదే. స్త్రీ సమస్యలు.. ఆత్మాభిమానంపై.. సమానత్వం.. లాంటి అంశాలే ఇతివృత్తంగా తీసుకుని ఆమె సాగించిన రచనలు ఇంటిల్లిపాదినీ ఆలరించాయి. అప్పట్లో యద్దనపూడి రాసిన నవల లేని ఇల్లు లేదని చెప్పడం అతిశయోక్తేమీ కాదు. అంతగా తన రచనలతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారామె. ​

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com