'సత్యం రాజేష్' త్వరలోనే హీరోగా..
- December 07, 2015హాస్యనటులుగా ఇండస్ట్రీకి పరిచయం అయిన తరువాత హీరోగా మారిన వారు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అయితే ఇలా హీరోగా మారిన నటులు సక్సెస్ అయిన దాఖలాలు మాత్రం చాలా తక్కువ. ఇప్పుడు ఇదే బాటలో మరో హాస్య నటుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. సత్యం సినిమాతో కమెడియన్ గా అందరి దృష్టిని ఆకర్షించి, ఆ తరువాత కుర్ర హీరోలతో వరుస సినిమాలు చేస్తున్న 'సత్యం రాజేష్' త్వరలోనే హీరోగా అలరించనున్నాడు. త్రిష లీడ్ రోల్ లో నటిస్తున్న లేడి ఓరియంటెడ్ సినిమా నాయకీ సినిమా ద్వారా రాజేష్ హీరోగా మారుతున్నాడు. అయితే ఈ సినిమాలో రాజేష్, త్రిషకు జంటగా నటించడంలేదు. రెండు జంటల ప్రేమకథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజేష్ కు జోడిగా సుష్మారాజ్ నటించనుంది. త్రిష జోడిగా డమరుకం ఫేం వెంకట్రామన్ కనిపించనున్నాడు. 1980లలో జరిగే కథగా తెరకెక్కనున్న ఈ సినిమాను హార్రర్ జానర్ లో రూపొందిస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమాకు గోవర్థన్ రెడ్డి దర్శకుడు
తాజా వార్తలు
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష