బహ్రెయిన్లో నిపా వైరస్ ఎఫెక్ట్?
- May 26, 2018బహ్రెయిన్:భారతదేశంలోని కేరళ రాష్ట్రాన్ని నిపా వైరస్ కుదిపేస్తోంది. పొరుగున వున్న కర్నాటకతోపాటు, తెలంగాణలోనూ నిపా వైరస్ పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈ నిపా వైరస్కి కారణం గబ్బిలాలేనంటూ జరుగుతున్న ప్రచారంపై కొంత గందరగోళం నెలకొంది. ఇదిలా వుంటే, బహ్రెయిన్లో ఫ్రూట్ ట్రేడర్స్ ఇండియా నుంచి వచ్చే పళ్ళను దిగుమతి చేసుకోవడంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. నిపా వైరస్కి కారణమని పేర్కొంటున్న గబ్బిలాలు, పళ్ళను తినే జాతికి చెందినవనీ, ఆ కోణంలో చూస్తే, పండ్లకు నిపా వైరస్ని మోసుకెళ్ళే అవకాశం వుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్న దరిమిలా, ట్రేడర్స్కి కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. అయితే నిపా వైరస్ వున్న గబ్బిలాలు కొరికిన పండ్లు మాత్రమే ప్రమాదకరమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అది కూడా గబ్బిలాలతో నిపా వైరస్ వస్తోందనడానికి సరైన రుజువులు లేవు కాబట్టి, పూర్తిగా ఇందులో నిజం ఎంతుందనేది తేలాల్సి వుందంటున్నారు. సెంట్రల్ మార్కెట్లోని ఫ్రూట్ ట్రేడర్స్ ఆందోళన సంగతి పక్కన పెడితే, కస్టమ్స్ డిపార్ట్మెంట్ కూడా నిపా ఔట్ బ్రేక్ నేపథ్యంలో పండ్ల దిగుమతికి సుముఖత వ్యక్తం చేయడంలేదు.
తాజా వార్తలు
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!