'వర్జిన్' ఓడ పెద్దవాళ్లకు మాత్రమే..
- May 26, 2018
2,750 మంది ప్రయాణీకులు ఒకేసారి ఆ ఓడలో ప్రయాణిస్తూ సముద్రపు అందాలను వీక్షించొచ్చు. బ్రిటన్కు చెందిన పారిశ్రామిక వేత్త రిచర్డ్ బ్రాన్ సన్ ఓ బ్రహ్మాండమైన క్రూజ్ షిప్ను 2020 కల్లా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కరేబియన్ దీవుల నుంచి మయామీ వరకు సముద్ర యానం చేయానుకునేవారికి ఈ షిప్ చాలా సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. అన్ని ఆధునిక హంగులు ఈ షిప్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. అయితే ఈ ఓడలో మరీ ఓల్డ్ కాదు మరీ యంగ్ కాదు.. ఎంట్రీ ఓన్లీ ఫర్ అడల్ట్కి మాత్రమే అంటున్నారు తయారీదారులు. అందుకే షిప్కి వర్జిన్ అని పేరు పెట్టారు. ప్రయాణంలో కొత్త అనుభూతుల్ని కోరుకునే వారికి మా ఓడలో ప్రయాణం మరింత ఆనందాన్నిఇస్తుందంటున్నారు. 93 శాతం సముద్ర దృశ్యాలను వీక్షించేందుకు వీలుగా అత్యధికంగా బాల్కనీలు ఏర్పాటు చేసారు. లోపల నచ్చిన ఫుడ్డూ, మెచ్చిన బెడ్డూ అన్నీ అందుబాటులో ఉంటాయట. రెస్టారెంట్లు, క్లబ్ హౌస్లు, స్విమ్మింగ్ పూల్స్ ఓహ్.. ఒకటేమిటి అన్నీ మీ కళ్లముందు సాక్షాత్కరిస్తాయి. స్వర్గమేమో కదా ఇది అని అనిపించకమానదు అని అంటున్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







