'వర్జిన్' ఓడ పెద్దవాళ్లకు మాత్రమే..
- May 26, 2018
2,750 మంది ప్రయాణీకులు ఒకేసారి ఆ ఓడలో ప్రయాణిస్తూ సముద్రపు అందాలను వీక్షించొచ్చు. బ్రిటన్కు చెందిన పారిశ్రామిక వేత్త రిచర్డ్ బ్రాన్ సన్ ఓ బ్రహ్మాండమైన క్రూజ్ షిప్ను 2020 కల్లా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కరేబియన్ దీవుల నుంచి మయామీ వరకు సముద్ర యానం చేయానుకునేవారికి ఈ షిప్ చాలా సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. అన్ని ఆధునిక హంగులు ఈ షిప్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. అయితే ఈ ఓడలో మరీ ఓల్డ్ కాదు మరీ యంగ్ కాదు.. ఎంట్రీ ఓన్లీ ఫర్ అడల్ట్కి మాత్రమే అంటున్నారు తయారీదారులు. అందుకే షిప్కి వర్జిన్ అని పేరు పెట్టారు. ప్రయాణంలో కొత్త అనుభూతుల్ని కోరుకునే వారికి మా ఓడలో ప్రయాణం మరింత ఆనందాన్నిఇస్తుందంటున్నారు. 93 శాతం సముద్ర దృశ్యాలను వీక్షించేందుకు వీలుగా అత్యధికంగా బాల్కనీలు ఏర్పాటు చేసారు. లోపల నచ్చిన ఫుడ్డూ, మెచ్చిన బెడ్డూ అన్నీ అందుబాటులో ఉంటాయట. రెస్టారెంట్లు, క్లబ్ హౌస్లు, స్విమ్మింగ్ పూల్స్ ఓహ్.. ఒకటేమిటి అన్నీ మీ కళ్లముందు సాక్షాత్కరిస్తాయి. స్వర్గమేమో కదా ఇది అని అనిపించకమానదు అని అంటున్నారు.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







