నిపా వైరస్ భయం...కేరళ పండ్ల దిగుమతిపై గల్ఫ్ దేశాల నిషేధం
- May 28, 2018
తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలో వెలుగుచూసిన నిపా వైరస్ ఆ రాష్ట్ర పర్యాటక రంగాన్నే కాదు పండ్ల వ్యాపారాన్ని సైతం దెబ్బతీసింది. కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ సోకి పదిమందికి పైగా మృతి చెందిన నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి పండ్ల దిగుమతిపై గల్ఫ్ దేశాలు నిషేధం విధించాయి. నిపా వైరస్ తమ దేశంలోకి వ్యాపిస్తుందనే భయంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైట్ దేశాలు కేరళ పండ్లు, కూరగాయల దిగుమతిని నిషేధించాయి. కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి వచ్చిన పండ్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు తిప్పి పంపించాయి. పవిత్ర రమజాన్ మాసం సందర్భంగా గల్ఫ్ దేశాలు కేరళ నుంచి పండ్లు, కూరగాయలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునేవి. నిపా వైరస్ సోకిన నేపథ్యంలో కేరళ నుంచి పండ్లు, కూరగాయలు పంపించవద్దని గల్ఫ్ దేశాల వ్యాపారులు కోరారు. తిరువనంతపురం నుంచి ప్రతీరోజూ 50 టన్నుల పండ్లు, కూరగాయలను గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసేవారు. నిపా వైరస్ వల్ల పండ్లు, కూరగాయల ఎగుమతి నిలచిపోవడంతో తాము తీవ్రంగా నష్టపోయామని వ్యాపారులు, రైతులు ఆవేదనగా చెప్పారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







