నిపా వైరస్ వ్యాప్తి..పండుగలు,ఇఫ్తార్ విందుల రద్దు
- May 28, 2018
మణప్పురం: కేరళ రాష్ట్రంలోని మణప్పురం జిల్లాలో నిపా వైరస్ అనుమానంతో జిల్లావైద్యఆరోగ్య శాఖాధికారులు 400 మందిని ముందుజాగ్రత్త చర్యగా వైద్యుల పరిశీలనలో ఉంచారు. నిపా వైరస్ లక్షణాలున్న రోగులను ప్రత్యేక ఆసుపత్రులకు పంపించాలని మణప్పురం జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ కె. సకీనా ఆదేశించారు. నిపా వైరస్ సోకిన రోగులను ప్రత్యేక శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తలు సహాయకులుగా ఉన్న ఐదు అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలిస్తున్నామని డాక్టర్ సకీనా వెల్లడించారు. నిపా వైరస్ వ్యాప్తి చెందిన నేపథ్యంలో పండుగలు, సమ్మేళనాలు, ఇఫ్తార్ విందులు నిర్వహించవద్దని డాక్టర్ సూచించారు. దీంతోపాటు ప్రభుత్వ అధికారిక ఉత్సవాలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు మణప్పురం జిల్లా కలెక్టరు అమిత్ మీనా ఆదేశాలు జారీ చేశారు. జూన్ 6వతేదీ వరకు పాఠశాలలు, కళాశాలలను మూసి ఉంచాలని కలెక్టరు జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







