అబుదాబీ క్రౌన్ ప్రిన్స్తో యూఏఈ పీఎం భేటీ
- December 08, 2015
దుబాయ్ రూలర్ మరియు అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ సమావేశమై భద్రత, పౌరులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో చర్చలు జరిగాయి. పలు అంశాలపై వీరిద్దరూ చర్చించారు. దేశ ప్రయోజనాలు, ప్రజల భద్రత వంటి అంశాలు ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చాయి. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నేతృత్వంలో, ఆయన ఆలోచనల మేరకు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతోపాటు, ప్రజలు ఉన్నత విలువలతో, ఉన్నతమైన సౌకర్యాలతో భద్రతతో కూడిన జీవనం పొందేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







