అబుదాబీ క్రౌన్ ప్రిన్స్తో యూఏఈ పీఎం భేటీ
- December 08, 2015
దుబాయ్ రూలర్ మరియు అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ సమావేశమై భద్రత, పౌరులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో చర్చలు జరిగాయి. పలు అంశాలపై వీరిద్దరూ చర్చించారు. దేశ ప్రయోజనాలు, ప్రజల భద్రత వంటి అంశాలు ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చాయి. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నేతృత్వంలో, ఆయన ఆలోచనల మేరకు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతోపాటు, ప్రజలు ఉన్నత విలువలతో, ఉన్నతమైన సౌకర్యాలతో భద్రతతో కూడిన జీవనం పొందేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







