బస్సుపై దాడి కేసులో జనవరి 12న విచారణ
- December 08, 2015
ఇంటీరియర్ మినిస్ట్రీకి చెందిన బస్సుపై తీవ్రవాదులు దాడి జరిపి, ఇద్దరు పబ్లిక్ సెక్యూరిటీ పర్సనల్ మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని అడ్వొకేట్ జనరల్, టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ చీఫ్ అహ్మద్ అల్ హమ్మాది చెప్పారు. ఈ కేసులో 24 మందిని నిందితులుగా గుర్తించడం జరిగిందనీ, పలు సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారాయన. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని, నిందితులపై అభియోగాల్ని రుజువు చేయనుంది. ఓ పొలిటికల్ సొసైటీకి చెందిన మెంబర్, ఇరాన్ నుంచి నిధులు సేకరించి, కొందర్ని రిక్రూట్ చేసుకుని మరీ ఉద్దేశ్యపూర్వకంగా బాంబులతో, మారణాయుధాలతో ఇంటీరియర్ మినిస్ట్రీ బస్సుపై దాడి చేశారని సిఐడి తేల్చింది. విచారణలో భాగంగా జరిగిన తనిఖీల్లో భారీగా మారణాయుధాలు నిందితుల నుంచి లభ్యమయ్యాయి. ఈ కేసు విచారణ జనవరి 12కి వాయిదా పడింది. ఆ రోజు హై క్రిమినల్ కోర్టులో విచారణ జరుగుతుంది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







