అబుధాబిలో ఇండియన్ కి జాక్‌పాట్‌

- June 03, 2018 , by Maagulf
అబుధాబిలో ఇండియన్ కి జాక్‌పాట్‌

అబుధాబి:అబుధాబిలో భారత్‌కు చెందిన వ్యక్తికి లాటరీ ద్వారా సుమారు 18 కోట్ల రూపాయలు లభించనున్నాయి. దిక్సన్‌ కత్తితర అబ్రహం అనే వ్యక్తి నైజీరియాలో నివసిస్తున్నాడు. అతను 'బిగ్‌టికెట్‌ అబుధాబి' నుండి ఒక లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. కాగా, ఆదివారం అబుదాబి ఇంటర్నేషనల ఎయిర్‌పోర్ట్‌లోని ఒక హాల్‌లో అతనికి సుమారు 10 మిలియన్ల ధిరమ్స్‌(18,22,25,000) లాటరీలో గెలుపొందినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. మిగతా తొమ్మిది మందిలో కూడా ఐదుగురు భారతీయులు, ముగ్గురు పాకిస్తాన్‌, ఒక దుబాయికి చెందిన వ్యక్తులు కొంత నగదు బహుమతిని పొందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com