ఇరాన్పై యుద్ధం లేదని తేల్చేసిన ఖతర్ ఉపప్రధాని
- June 03, 2018
సింగపూర్:ఇరాన్తో ఎటువంటి శత్రుత్వాన్ని కొనసాగించదని ఖతర్ సీనియర్ ఉన్నతాధికారి ఆదివారం స్పష్టం చేశారు. సింగపూర్లో జరుగుతున్న అంతర్జాతీయ భద్రత కాన్ఫరెన్స్లో పాల్గొన్న రక్షణ శాఖ మంత్రి, ఉపప్రధాని ఖలీద్ ఎల్ అతియాహ్ మాట్లాడుతూ ఖతర్కు ఇరాన్తో చాలా విభేదాలు ఉన్నాయని, కానీ తమ దేశం యుద్ధానికి ఆజ్యం పోయదని తెలిపారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించడం వివేకమా అని ప్రశ్నించారు. ఇరాన్పై యుద్ధానికి మూడవ పక్షంగా ఉన్న కొన్ని దేశాలు ప్రేరేపిస్తున్నాయని, ఇది ఎంతో ప్రమాదకరమైనదని ఆయన ఆరోపించారు. ఇరాన్ తమకు సన్నిహిత మిత్ర దేశమని, శాంతి చర్చలపై పిలుస్తామని ఆయన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇరాన్పై వైమానిక దాడులను ప్రయోగించడానికి వైమానిక స్థావరాలను ఉపయోగిస్తారా అన్న ప్రశ్నకు తమ దేశం యుద్ధాన్ని ప్రేరేపించదని పేర్కొన్నారు. ఇస్లామిక్ స్టేట్,ఆప్గనిస్తాన్పై యుద్ధం చేయడానికి ఆల్ యుడిద్ ఎయిర్ బేస్లో 10వేల అమెరికా దళాలు ఖతర్లో ఉన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







