ఐసిస్‌లో చేరేందుకు నలుగురు ఎమిరేటీల యత్నం

- December 08, 2015 , by Maagulf
ఐసిస్‌లో చేరేందుకు నలుగురు ఎమిరేటీల యత్నం




నలుగురు ఎమిరేటీ వ్యక్తులు యూఏఈ నుంచి ఒమన్‌కి అ్కమ మార్గంలో వెళ్ళారు. ఐసిస్‌లో చేరేందుకు వీరు అక్రమంగా సరిహద్దులు దాటినట్లు ఫెడరల్‌ సుప్రీంకోర్ట్‌ వెల్లడించింది. 8 మంది ఎమిరేటీలు, ఓ సిరియన్‌ మరియు ఓ బహరెయినీ ఐసిస్‌తో లింకులు ఉన్నట్లుగా గుర్తించారు. మారిటానియాకి చెందిన 22 ఏళ్ళ వ్యక్తి ఐసిస్‌లో చేరేవారి కోసం ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తున్నాడు. అత్యంత రహస్యంగా ఐసిస్‌లో చేర్చేందుకు ముందుగా కొన్ని చోట్ల సమావేశాలు నిర్వహించి, ఐసిస్‌ తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయగలుగుతున్నారు నిందితులు. అయితే ఆరుగురు నిందితుల తరఫున వాదనలు వినిపిస్తోన్న న్యాయవాదులు, పూర్తి వాదనలు వినిపించేందుకు సమయం కావాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. డిసెంబర్‌ 21కి ఈ కేసు విచారణ వాయిదా పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com