అగ్నిప్రమాదంపై హెచ్ఎంసి విచారం
- December 08, 2015
హమాద్ మెడికల్ కార్పొరేషన్ (హెచ్ఎంసి) తమ స్టాప్ అకామిడేషన్ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించి తమ ఉద్యోగి భార్య మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. హెచ్ఎంసి టెక్నీషియన్ రఫీల్ పింగుల్ భార్య చోనా ఈ అగ్ని ప్రమాదంలో మృతి చెందగా, కుమార్తె మిసీలా ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గా ఉంది. అలాగే పింగ్ కుమారుడు కూడా గాయాలతో చికిత్స పొందుతున్నాడు. హెచ్ఎంసి తమ ఉద్యోగుల కోసం క్వార్టర్స్ని నిర్వహిస్తోంది. ప్రమాదం తర్వాత క్వార్టర్స్లో ఎమర్జన్సీ సౌకర్యాల్ని మరింతగా పెంచాల్సిన ఆవశ్యకతపై హమాద్ మెడికల్ కార్పొరేషన్ దృష్టిపెట్టింది. ప్రమాదం సంభవించిన క్వార్టర్స్ నుంచి చాలామంది ఉద్యోగుల కుటుంబాలు ఖాళీ చేసేశాయి. వారికి ప్రత్యామ్నాయ నివాస ఏర్పాట్లను హెచ్ఎంసి చేపట్టింది. ప్రమాద కారణాల్ని అన్వేషించి, ఇకపై ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హమాద్ మెడికల్ కార్పొరేషన్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







