నాకు నిశ్చితార్ధం జరిగింది:శ్వేతా బసు

- June 03, 2018 , by Maagulf
నాకు నిశ్చితార్ధం జరిగింది:శ్వేతా బసు

'కొత్తబంగారులోకం' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది శ్వేతాబసు ప్రసాద్. ఆ సినిమాతో  కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టేసింది. ఆ సినిమా సమయంలో శ్వేత నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత శ్వేత నటించిన చిత్రాలు ఆశించదగ్గస్థాయిలో ఆడలేదు.కాస్త  'రైడ్' పరవాలేదనిపించినా మిగతావి నిరాశపరిచాయి. దాంతో  ఆమె కెరీర్ గాడి తప్పింది. ఆ తరువాత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వచ్చింది. ఈ క్రమంలో శ్వేత బసు బాలీవుడ్ సీరియళ్ళలో నటిస్తోంది. ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదన్న ఈ బ్యూటీ ఇటీవల ప్రేమలో పడింది. లవ్ లో పడటమే కాదు తనకు కాబోయే అత్తమామలను కూడా పెళ్ళికి ఒప్పించింది. ఈ విషయం స్వయంగా ఆమె వెల్లడించింది. ముందుగా అబ్బాయిలు పెళ్లి ప్రస్తావన తెచ్చే ఈ రోజుల్లో ముందుగా తన బాయ్ ఫ్రెండ్ కు తానే ప్రొపోజ్ చేశానని అతనే రోహిత్‌ అని చెప్పింది. సంవత్సరంక్రితం గోవాలో తామిద్దరం కలిసినప్పుడు రోహిత్‌ కు ప్రపోజ్‌ చేశాను. ఆ తర్వాత అతను పుణెలో నా ప్రేమను అంగీకరించాడు. పైగా తాను.. రోహిత్‌ ఇంట్లో వారికీ కూడా నచ్చడంతో పెళ్లికి ఒప్పుకొన్నారు. ఆలా  అత్తమామలను ఒప్పించాను. కానీ పెళ్లికి తొందరేం లేదు. ఇప్పటికే మా ఇద్దరి నిశ్చితార్థం జరిగింది. మా జీవితాలకు సంబంధించిన విషయాలు బయటికి చెప్పుకోవాలని అనుకోవడం లేదని శ్వేత వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com