బ్రేక్ లోపం: 8000 వాహనాల రీకాల్
- June 04, 2018
యూఏఈలో మిట్సుబిషికి చెందిన 8000 కార్లను 'బ్రేక్ లోపం' కారణంగా రీ కాల్ చేశారు. 2013 నుంచి 2016 సంవత్సరానికి సంబంధించిన వాహనాల్లో ఈ లోపాన్ని గుర్తించారు. పార్కింగ్ బ్రేక్లో లోపాన్ని గుర్తించామనీ, నీటి నిల్వ బ్రేక్ పనితనాన్ని తగ్గిస్తుందని నిర్ధారించి, ఆయా వాహనాల్ని రీకాల్ చేస్తున్నామని మిట్సుబిషి వెల్లడించింది. లోపాన్ని సరిదిద్దేందుకుగాను ఎలాంటి ఛార్జ్ వసూలు చేయబోమని జపాన్కి చెందిన మిట్సుబిషి పేర్కొంది. దుబాయ్, నార్త్ ఎమిరేట్స్, అబుదాబీ, అల్ అయిన్లో మొత్తం 8,074 వాహనాల్లో ఈ సమస్య గుర్తించినట్లు సంస్థ వెల్లడించింది. అల్ హబ్తూర్ మోటార్స్ (మిట్సుబిషి డిస్ట్రిబ్యూటర్) తమ వినియోగదారులకు పూర్తి సమాచారం ఇస్తోంది.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







