మస్కట్:వాటర్ బాటిల్స్లో బ్యాక్టీరియా, అల్గాయ్
- June 08, 2018
మస్కట్: అనారోగ్యకరమైన పరిస్థితుల్లో వున్న వాటర్ బాటిల్స్ని విక్రయిస్తున్న కారణంగా ఓ కంపెనీకి 600 ఒమన్ రియాల్స్ జరీమానా విధించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ (పిఎసిపి) పేర్కొంది. ఓ వినియోగదారుడి ఫిర్యాదు మేరకు పిఎసిపి అధికారులు తనిఖీలు నిర్వహించగా, తనిఖీల్లో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. వాటర్ బాటిల్స్లోని నీటిలో బ్యాక్టీరియా, అల్గాయ్ కన్పించాయి. ఈ బాటిల్స్లో నీరు తాగితే అనారోగ్యం పాలవడం ఖాయమని అధికారులు పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూటర్కి జరీమానా విధించడమే కాక, హెచ్చరికలు కూడా జారీ చేశామని అధికారులు తెలిపారు. వినియోగదారుల హక్కులను ఉల్లంఘించేలా, వారి ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా డిస్ట్రిబ్యూటర్స్, విక్రయదారులు వ్యవహరించరాదని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









