ఈ నెల 23న "చినబాబు" ఆడియో రిలీజ్
- June 14, 2018
కార్తీ నటించిన "చినబాబు" సినిమా ఆడియో రిలీజ్ వేడుకను ఈ నెల 23న నిర్వహించనున్నారు. జులై 13న చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని నిర్మాతలు నిర్ణయించారు. కార్తీ సరసన సయేషా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీలో యాక్షన్ తో పాటు కామెడీ ఉండబోతోంది. కార్తీ ఈ మూవీలో రైతు పాత్రలో కనిపించబోతున్నాడు. రైతుల సమస్యలను ఈ సినిమాలో చర్చించడం జరిగింది. ఇటీవల విడుదలైన "చినబాబు" టీజర్ కు మంచి స్పందన లభించింది. 23న జరగబోయే "చినబాబు" ఆడియో విడుదల కార్యక్రమంలో కార్తీ, సూర్య పాల్గొనబోతున్నారు. నటుడు సత్యరాజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించారు. నటుడు శత్రు ఈ మూవీలో విలన్ గా నటించాడు. డి.ఇమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హీరో సూర్య తో పాటు నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి "2డి ఎంటర్టైన్మెంట్స్" బ్యానర్ మరియు "ద్వారకా క్రియేషన్స్" బ్యానర్ లో నిర్మించడం విశేషం. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ సాంగ్ (చినదాని) లిరికల్ వీడియోకు మంచి స్పందన లభించింది.
నటీనటులు:
కార్తీ, సయేష, ప్రియా భవాని శంకర్, సత్య రాజ్, భానుప్రియ, సూరి, శంకర్, ఆర్థన బిను
సాంకేతిక నిపుణులు:
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : పాండిరాజ్
నిర్మాతలు: సూర్య, మిరియాల రవీందర్ రెడ్డి
బ్యానర్స్: 2డి ఎంటర్టైన్మెంట్స్, ద్వారకా క్రియేషన్స్
సహా నిర్మాతలు: సి.హెచ్. సాయి కుమార్ రెడ్డి, రాజశేఖర్ కర్పూర, సుందర పాండియాన్.
సంగీతం: డి.ఇమాన్
కెమెరామెన్: వేల్ రాజ్
ఎడిటింగ్: రుబన్
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’







