యూఏఈలో కొత్త జాబ్, వీసా రూల్స్ని ప్రకటించిన షేక్ మొహమ్మద్
- June 14, 2018
యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ నేతృత్వంలో జరిగిన క్యాబినెట్, పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రైవేట్ సెక్టార్లో ఫారిన్ వర్కర్స్ ఇన్స్యూరెన్స్ అలాగే వీసా ఫెసిలిటేషన్స్కి సంబంధించిన కీలక నిర్ణయాలు ఇందులో వున్నాయి. ఇప్పటిదాకా వున్న 3,000 దిర్హామ్ల మ్యాండేటరీ డిపాజిట్ స్థానంలో 60 దిర్హామ్ల డిపాజిట్ని ఇన్సూరెన్స్ నిమిత్తం తీసుకొచ్చారు. విజిటర్స్, రెసిడెంట్స్, ఫ్యామిలీస్, పీపుల్కి సంబంధించి వీసా ఫెసిలిటేషన్స్ని క్యాబినెట్ అడాప్ట్ చేసింది. ప్రస్తుత రెసిడెన్సీ సిస్టమ్ని రివ్యూ చేయాలని కూడా నిర్ణయించారు. ట్రాన్సిట్ వీసాకి సంబంధించి ఎగ్జంప్ట్ని క్యాబినెట్ అప్రూవ్ చేసింది. ఇకపై ట్రాన్సిట్ వీసా 96 గంటల వరకు పొడిగించడానికి వీలుంది. ఇందుకోసం కేవలం 50 దిర్హామ్ల ఫీజుని మాత్రమే వసూలు చేస్తారు. ఓవర్ స్టేయింగ్ పీపుల్కి సంబంధించి 'నో ఎంట్రీ' పాస్పోర్ట్ స్టాంప్ లేకుండా, దేశం విడిచేందుకు అవకాశం కల్పిస్తారు. ఓవర్స్టే చేసే జాబ్ సీకర్స్కి 6 నెలల వీసా మంజూరు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ కేటగిరీలోనివారు, ఇతరులతో సమానంగా అవకాశాలు పొందేలా వారికి వెసులుబాటు కల్పించేందుకు క్యాబినెట్ ఓ రిజల్యూషన్ని అడాప్ట్ చేసింది.
తాజా వార్తలు
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’
- తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్..ఈ రూట్లోనే ప్రయాణం రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్
- నకిలీ మందుల చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి
- భారతీయురాలిగానే చనిపోవాలి.. అమెరికా పౌరసత్వం వదులుకున్న 94ఏళ్ల వృద్ధురాలు!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం







