యూఏఈలో కొత్త జాబ్, వీసా రూల్స్ని ప్రకటించిన షేక్ మొహమ్మద్
- June 14, 2018
యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ నేతృత్వంలో జరిగిన క్యాబినెట్, పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రైవేట్ సెక్టార్లో ఫారిన్ వర్కర్స్ ఇన్స్యూరెన్స్ అలాగే వీసా ఫెసిలిటేషన్స్కి సంబంధించిన కీలక నిర్ణయాలు ఇందులో వున్నాయి. ఇప్పటిదాకా వున్న 3,000 దిర్హామ్ల మ్యాండేటరీ డిపాజిట్ స్థానంలో 60 దిర్హామ్ల డిపాజిట్ని ఇన్సూరెన్స్ నిమిత్తం తీసుకొచ్చారు. విజిటర్స్, రెసిడెంట్స్, ఫ్యామిలీస్, పీపుల్కి సంబంధించి వీసా ఫెసిలిటేషన్స్ని క్యాబినెట్ అడాప్ట్ చేసింది. ప్రస్తుత రెసిడెన్సీ సిస్టమ్ని రివ్యూ చేయాలని కూడా నిర్ణయించారు. ట్రాన్సిట్ వీసాకి సంబంధించి ఎగ్జంప్ట్ని క్యాబినెట్ అప్రూవ్ చేసింది. ఇకపై ట్రాన్సిట్ వీసా 96 గంటల వరకు పొడిగించడానికి వీలుంది. ఇందుకోసం కేవలం 50 దిర్హామ్ల ఫీజుని మాత్రమే వసూలు చేస్తారు. ఓవర్ స్టేయింగ్ పీపుల్కి సంబంధించి 'నో ఎంట్రీ' పాస్పోర్ట్ స్టాంప్ లేకుండా, దేశం విడిచేందుకు అవకాశం కల్పిస్తారు. ఓవర్స్టే చేసే జాబ్ సీకర్స్కి 6 నెలల వీసా మంజూరు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ కేటగిరీలోనివారు, ఇతరులతో సమానంగా అవకాశాలు పొందేలా వారికి వెసులుబాటు కల్పించేందుకు క్యాబినెట్ ఓ రిజల్యూషన్ని అడాప్ట్ చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







