ఖతార్:ఇఫ్తార్ పార్టీ, వైఎస్సార్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ అవార్డ్స్
- June 14, 2018
ఖతార్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దోహా ఖతార్ కన్వీనర్ దొండపాటి శశికిరణ్ నేతృత్వంలో వైస్సార్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ 2018 నిర్వహించారు.అలాగే, వైఎస్సార్సీపీ దోహా ఖతార్ కో కన్వీనర్ జాఫర్ హుస్సేన్ ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేశారు. మే 11 న నుంచి ప్రారంభించారు.15 జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీకి సంబంధించి ఫైనల్ మ్యాచ్ ఖతార్ ఫౌండేషన్ గ్రౌండ్స్లో జరిగింది. విజేతలకు 5000 ఖతారీ రియాల్స్ నగదుని బహుమతిగా అందజేశారు. ఈ నగదుని చింతలపాటి శ్రీనివాసరాజు అందించారు, రెండో విజేతకి 2500 ఖతారీ రియాల్స్ని బిషప్ డాక్టర్ ఓగూరి బుల్లబ్బాయి అందించారు.టోర్నమెంట్ సంబంధిత షీల్డ్స్ని సుంకర సాంబశివరావు స్పానర్ చేసారు, డ్రింకింగ్ వాటర్, స్నాక్స్ని నల్లి నాగేశ్వర్రావు సమకూర్చారు. మ్యాచ్ విజేతలు ఇప్తార్ పార్టీకి హాజరై, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పలువురు తెలుగు వారు పాలుపంచుకున్నారు.ఈ కార్యక్రమానికి కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి, షేక్ అమ్జాద్ బాషా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)







తాజా వార్తలు
- నకిలీ మందుల చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి
- భారతీయురాలిగానే చనిపోవాలి.. అమెరికా పౌరసత్వం వదులుకున్న 94ఏళ్ల వృద్ధురాలు!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- నిజులాలో భూకంపాల విధ్వంసం..235 మందికి పైగా మృతి..40వేల మంది ఆచూకీ గల్లంతు..
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!







