ఖతార్:ఇఫ్తార్ పార్టీ, వైఎస్సార్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ అవార్డ్స్
- June 14, 2018
ఖతార్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దోహా ఖతార్ కన్వీనర్ దొండపాటి శశికిరణ్ నేతృత్వంలో వైస్సార్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ 2018 నిర్వహించారు.అలాగే, వైఎస్సార్సీపీ దోహా ఖతార్ కో కన్వీనర్ జాఫర్ హుస్సేన్ ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేశారు. మే 11 న నుంచి ప్రారంభించారు.15 జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీకి సంబంధించి ఫైనల్ మ్యాచ్ ఖతార్ ఫౌండేషన్ గ్రౌండ్స్లో జరిగింది. విజేతలకు 5000 ఖతారీ రియాల్స్ నగదుని బహుమతిగా అందజేశారు. ఈ నగదుని చింతలపాటి శ్రీనివాసరాజు అందించారు, రెండో విజేతకి 2500 ఖతారీ రియాల్స్ని బిషప్ డాక్టర్ ఓగూరి బుల్లబ్బాయి అందించారు.టోర్నమెంట్ సంబంధిత షీల్డ్స్ని సుంకర సాంబశివరావు స్పానర్ చేసారు, డ్రింకింగ్ వాటర్, స్నాక్స్ని నల్లి నాగేశ్వర్రావు సమకూర్చారు. మ్యాచ్ విజేతలు ఇప్తార్ పార్టీకి హాజరై, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పలువురు తెలుగు వారు పాలుపంచుకున్నారు.ఈ కార్యక్రమానికి కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి, షేక్ అమ్జాద్ బాషా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)







తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







