గన్నవరం విమానాశ్రయం నుంచి కార్గో సేవలు ప్రారంభం...
- June 19, 2018
గన్నవరం విమానాశ్రయం నుంచి కార్గో సేవలు ప్రారంభమయ్యాయి... రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర కార్గో విమాన సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీపా లార్జిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజన్సీ సుకుమార్ పాల్గొన్నారు. ఇకపై గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ సహా ఇతర మార్గాల్లో 20 విమాన సర్వీసులతో కార్గో సేవలు అందించనుంది. దీంతో గన్నవరం విమానాశ్రయం అభివృద్ధిలో మరో అడుగు ముందుకు పడినట్టు అయ్యింది. అంతర్జాతీయ విమాన సర్వీసులు వస్తున్న తరుణంలో కార్గో సర్వీసులకు ఎంతో ప్రాధాన్యత ఉంది.. ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు సరుకులు రవాణా చేయడానికి వీలుంటుంది. అయితే కార్గో సేవలు విస్తరించడానికి మంచి అవకాశాలున్నాయన్నారు మంత్రి కొల్లు రవీంద్ర.
కార్గో సేవలు ప్రారంభించిన అనంతరం మీడియాలో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర... విజయవాడ నుంచి కార్గో సేవలు విస్తరించటానికి మంచి అవకాశాలున్నాయని తెలిపారు. దీంతో వ్యవసాయ, మత్య, మాంస ఉత్పత్తులకు మంచి ధరలు దక్కే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం దేశీయ మార్గాల్లో కార్గో సేవలు ప్రారంభించడగా... అతి త్వరలో అంతర్జాతీయ కార్గోగా విస్తరిస్తామని తెలిపారు. నూజివీడు మామిడి, మత్య, మాంస ఉత్పత్తులకు కార్గో వల్ల గిట్టుబాటు ధరలు వస్తాయని అంచనా వేస్తున్నామని వెల్లడించారు మంత్రి కొల్లు రవీంద్ర.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







