గన్నవరం విమానాశ్రయం నుంచి కార్గో సేవలు ప్రారంభం...
- June 19, 2018
గన్నవరం విమానాశ్రయం నుంచి కార్గో సేవలు ప్రారంభమయ్యాయి... రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర కార్గో విమాన సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీపా లార్జిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజన్సీ సుకుమార్ పాల్గొన్నారు. ఇకపై గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ సహా ఇతర మార్గాల్లో 20 విమాన సర్వీసులతో కార్గో సేవలు అందించనుంది. దీంతో గన్నవరం విమానాశ్రయం అభివృద్ధిలో మరో అడుగు ముందుకు పడినట్టు అయ్యింది. అంతర్జాతీయ విమాన సర్వీసులు వస్తున్న తరుణంలో కార్గో సర్వీసులకు ఎంతో ప్రాధాన్యత ఉంది.. ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు సరుకులు రవాణా చేయడానికి వీలుంటుంది. అయితే కార్గో సేవలు విస్తరించడానికి మంచి అవకాశాలున్నాయన్నారు మంత్రి కొల్లు రవీంద్ర.
కార్గో సేవలు ప్రారంభించిన అనంతరం మీడియాలో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర... విజయవాడ నుంచి కార్గో సేవలు విస్తరించటానికి మంచి అవకాశాలున్నాయని తెలిపారు. దీంతో వ్యవసాయ, మత్య, మాంస ఉత్పత్తులకు మంచి ధరలు దక్కే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం దేశీయ మార్గాల్లో కార్గో సేవలు ప్రారంభించడగా... అతి త్వరలో అంతర్జాతీయ కార్గోగా విస్తరిస్తామని తెలిపారు. నూజివీడు మామిడి, మత్య, మాంస ఉత్పత్తులకు కార్గో వల్ల గిట్టుబాటు ధరలు వస్తాయని అంచనా వేస్తున్నామని వెల్లడించారు మంత్రి కొల్లు రవీంద్ర.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







