ప్లిప్కార్ట్లో భారీ సేల్.. డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు.!
- June 19, 2018
ఎలక్ట్రానిక్ వస్తువులకు వేదిక అయిన ప్లిప్కార్ట్ నేటి నుంచి భారీ సేల్ ప్రారంభించింది. ఈ సేల్ జూన్ 24 వరకు కొనసాగుతుంది. సేల్లో భాగంగా గూగుల్ పిక్సెల్ 2, ఐఫోన్ 6, ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8 ప్లస్, మోటో ఎక్స్ 4 వంటి పాపులర్ మొబైల్ ఫోన్లను అందుబాటులో ఉంచింది. పిక్సెల్ 2 128 జీబీ మోడల్ అసలు ధర 70 వేల రూపాయలు ఉంటే సేల్లో 10,999కే ఇస్తుంది. ఈ ఆఫర్ పొందాలంటే ముందు రూ.199తో బైబ్యాక్ గ్యారెంటీ పాలసీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ సేల్లో భాగంగా ప్లిప్కార్ట్ ఈ ఫోన్పై 9,001 రూపాయల డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. అదే విధంగా క్రెడిట్, డెబిట్ కార్డు హోల్డర్స్కి మరింత అదనంగా మరో 8వేల క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. అంతే కాదు ఆరు నుంచి ఎనిమిది నెలలు వాడుకున్న తరువాత ఫోన్ వద్దనుకుంటే రూ.42 వేల ఎక్సేంజ్ వాల్యూ కూడా వినియోగ దారులు పొందొచ్చంటోంది. ఇలాంటివే మరికొన్ని ఫోన్లపై కూడా ఆఫర్లను అందిస్తోంది ప్లిప్కార్ట్.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







