పాక్ వ్యక్తిని పెళ్లాడిన నిజామాబాద్ మహిళకు భారత్ పౌరసత్వం ఇచ్చిన సర్కారు
- June 20, 2018
నిజామాబాద్:పాకిస్థాన్ దేశీయుడిని పెళ్లాడిన నిజామాబాద్ మహిళ, ఆమె ముగ్గురు కుమారులకు ఎట్టకేలకు భారత పౌరసత్వం లభించింది. పాక్ పౌరసత్వం ఉన్న మహిళ, ఆమె కుమారులకు భారత పౌరసత్వం ఇవ్వడం పట్ల బీజేపీ నేతలు నిరసన తెలపడంతో ఈ వ్యవహారం వార్తల్లోకెక్కింది.నిజామాబాద్ నగరానికి చెందిన ఫైజున్సీసా (45) 1988లో పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్సు బాహ్వాలాపూర్ పట్టణ నివాసి ముహమ్మద్ అబ్దుల్ నదీంజావీద్ ను పెళ్లి చేసుకొని పాకిస్థాన్ వెళ్లిపోయింది.ఫైజున్సీసాకు ముహమ్మద్ సనన్(29), రుమాన్ (27), సైఫ్ (25) లనే ముగ్గురు కుమారులు పుట్టాక భర్తతో విడాకులు తీసుకొని 2004లో దీర్ఘకాలిక వీసాపై స్వదేశానికి తిరిగివచ్చింది. అప్పటినుంచి నిజామాబాద్ పాత నగరంలో పాఠశాల నిర్వహిస్తూ ఫైజున్సీసా తన కుమారులతో కలిసి ఇక్కడే నివాసముంటోంది. ఫైజున్సీసాతో పాటు ఆమె కుమారులు 8 ఏళ్ల క్రితం భారత పౌరసత్వం ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా ఎట్టకేలకు సర్కారు వారికి భారత్ పౌరసత్వం ఇచ్చింది. పాక్ పౌరులకు భారత్ పౌరసత్వం ఎలా ఇస్తారని బీజేపీ నాయకులు నిరసన తెలిపారు.ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









