ఉమ్ అల్ కువైన్ లో ఘనంగా జరుపుకున్న 'ప్రపంచ యోగా దినోత్సవం'
- June 20, 2018
ఉమ్ అల్ కువైన్:నేడు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా గత రాత్రి అల్ వాసల్ స్పోర్ట్స్ క్లబ్ లో ఉమ్ అల్ కువైన్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ముందుగా కాన్సల్ జనరల్ విపుల్ జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమములో సెక్రటరీ జనరల్ హుమైడ్ రషీద్ అల్ షంసి,గవర్నమెంట్ ఆఫ్ ఉమ్ అల్ కువైన్ నుంచి మీరా మొహమ్మద్,గిరీష్ పంత్,జువ్వాడి శ్రీనివాస్,కుంభాల మహేందర్ రెడ్డి,బాలకిషన్ జంగం తదితరులు పాల్గొన్నారు.కాన్సల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ యోగా అనేది కేవలం వ్యాయామం కాదని, అది మనకు మన ప్రాచీన భారతీయులు అందించిన బహుమతి అని అన్నారు.యోగా అనేది అన్ని పనులపై ఏకాగ్రతను పెంచడమే కాకుండా కుటుంబంలో, సమాజంలో సద్భావనను కల్పిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో నాలుగు వందల మంది పైగా పాల్గొన్నారు.
అజ్మన్లోని ఇండియన్ అసోసియేషన్ ప్రిమైసిస్లో జూన్ 21న సాయంత్రం 7 గంటలకు, షార్జాలోని ఎక్స్పో సెంటర్లో జూన్ 22న సాయంత్రం 4 గంటలకు, ఫుజైరాలో మీడియా పార్క్ కన్వెన్షన్ సెంటర్లో జూన్ 22న 6.30 నిమిషాలకు, రస్ అల్ ఖైమాలో జూన్ 22న అమెరికన్ యూనివర్సిటీలో 7 గంటలకు ఈ ఈవెంట్ జరుగుతుంది. యోగా పట్ల ఆసక్తి వున్నవారంతా దుబాయ్లోని మెయిన్ ప్రోగ్రామ్తోపాటు, ఇతర ఎమిరేట్స్లో నిర్వహించే ఈవెంట్స్లోనూ పాల్గొనాలని నిర్వాహకులు తెలిపారు. ఈ ఈవెంట్స్లోకి ప్రవేశం ఉచితం.




తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









