150కి పైగా దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు...
- June 20, 2018
శాంతి కోసం యోగా అనే థీమ్తో ఈ ఏడాది యోగా డే జరుగుతోంది. నాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాల్లో యోగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 5 వేల కార్యక్రమాలు ఆయుష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.150కి పైగా దేశాల్లోనూ భారత రాయబార కార్యాలయాలు, స్థానికులతో కలిసి యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో రాజ్పథ్ వద్ద ప్రధాన కార్యక్రమం సహా 8 చోట్ల నిర్వహిస్తున్నారు. బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో ఎర్రకోట వద్ద జరుగుతున్న కార్యక్రమంలో బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ వంటి కేంద్ర సాయుధ బలగాల సిబ్బంది సహా 50 వేల మంది పాల్గొన్నారు. అటు రాజస్థాన్లోని కోటా పట్టణంలో రాందేవ్ బాబా ఆధ్వర్యంలో రికార్డు సృష్టించేలా యోగాసనాలు వేస్తున్నారు. 2 లక్షల మంది జనం ఈ ఆసనాల్లో పాల్గొనడం ద్వారా రికార్డ్ బ్రేక్ చేయబోతున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









