150కి పైగా దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు...
- June 20, 2018
శాంతి కోసం యోగా అనే థీమ్తో ఈ ఏడాది యోగా డే జరుగుతోంది. నాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాల్లో యోగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 5 వేల కార్యక్రమాలు ఆయుష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.150కి పైగా దేశాల్లోనూ భారత రాయబార కార్యాలయాలు, స్థానికులతో కలిసి యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో రాజ్పథ్ వద్ద ప్రధాన కార్యక్రమం సహా 8 చోట్ల నిర్వహిస్తున్నారు. బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో ఎర్రకోట వద్ద జరుగుతున్న కార్యక్రమంలో బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ వంటి కేంద్ర సాయుధ బలగాల సిబ్బంది సహా 50 వేల మంది పాల్గొన్నారు. అటు రాజస్థాన్లోని కోటా పట్టణంలో రాందేవ్ బాబా ఆధ్వర్యంలో రికార్డు సృష్టించేలా యోగాసనాలు వేస్తున్నారు. 2 లక్షల మంది జనం ఈ ఆసనాల్లో పాల్గొనడం ద్వారా రికార్డ్ బ్రేక్ చేయబోతున్నారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







