ఫేక్ బాంబ్: బహ్రెయినీ టీనేజర్కి జైలు
- June 22, 2018హై క్రిమినల్ కోర్టు ఓ బహ్రెయినీ యువకుడికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. నిందితుడు, తన సోదరుడితో కలిసి ఫేక్ బాంబు తయారీలో నైపుణ్యం సంపాదించినట్లు విచారణలో నిర్ధారణ అయ్యింది. 2016, మే 22న జిద్ అలి ప్రాంతంలో ఓ డివైజ్ని కనుగొన్నారు. ఈ హోక్స్ బాంబ్ని ప్లాస్టిక్ బాక్స్తో తయారు చేశారు. ఎంపీ3 గ్యాడ్జెట్తో కనెక్ట్ చేసి, టేప్ చేశారు. ఈ ఘటనలో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. జిద్ అలి ప్రాంతంలో ఎక్కువగా జనం గుమికూడే ప్రాంతంలో ఆ ఫేక్ బాంబ్ని పెట్టి, జనాన్ని భయపెట్టాలనుకున్నట్టు నిందితుడు తెలిపాడు. తీవ్రవాద భావజాలంతోనే ఈ ఫేక్ బాంబ్ని నిందితుడు తయారు చేసినట్లు ప్రాసిక్యూటర్స్ తెలిపారు.
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం