ఛీటింగ్: కేరళ వ్యక్తి అరెస్ట్
- June 22, 2018
కేరళ పోలీస్, ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఖతార్ రాయల్ ఫ్యామిలీని 5.6 కోట్ల మొత్తానికి చీటింగ్ చేసినట్లు ఇతనిపై అభియోగాలు మోపబడ్డాయి. ఖతార్ మ్యూజియం అథారిటీస్ నుంచి అందిన ఫిర్యాదు మేరకు జూన్ 13న కేసు రిజిస్టర్ చేశామని పోలీసులు వివరించారు. రాయల్స్కి చెందిన ఇ-మెయిల్స్ని ఫేక్ చేసి, వాటి ద్వారా నిందితుడు తన ఖాతాలోకి డబ్బుల్ని తరలించుకున్నట్లు పోలీసులు గుర్తించి, ఆ అకౌంట్నఇ బ్లాక్ చేసి, నిందితుడ్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ చీటింగ్లో మరికొంతమంది వుండి వుండొచ్చన్న అనుమానంతో కేసుని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సునీల్ మీనన్, త్రిస్సూర్కి చెందిన వ్యక్తి. ఛీటింగ్ ద్వారా సంపాదించిన మొత్తంలో కొంత మొత్తాన్ని కారు కొనుగోలు చేసేందుకు, సుమారు 20 లక్షల్ని ఇతర అవసరాల కోసం వినియోగించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







