ఛీటింగ్: కేరళ వ్యక్తి అరెస్ట్
- June 22, 2018
కేరళ పోలీస్, ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఖతార్ రాయల్ ఫ్యామిలీని 5.6 కోట్ల మొత్తానికి చీటింగ్ చేసినట్లు ఇతనిపై అభియోగాలు మోపబడ్డాయి. ఖతార్ మ్యూజియం అథారిటీస్ నుంచి అందిన ఫిర్యాదు మేరకు జూన్ 13న కేసు రిజిస్టర్ చేశామని పోలీసులు వివరించారు. రాయల్స్కి చెందిన ఇ-మెయిల్స్ని ఫేక్ చేసి, వాటి ద్వారా నిందితుడు తన ఖాతాలోకి డబ్బుల్ని తరలించుకున్నట్లు పోలీసులు గుర్తించి, ఆ అకౌంట్నఇ బ్లాక్ చేసి, నిందితుడ్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ చీటింగ్లో మరికొంతమంది వుండి వుండొచ్చన్న అనుమానంతో కేసుని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సునీల్ మీనన్, త్రిస్సూర్కి చెందిన వ్యక్తి. ఛీటింగ్ ద్వారా సంపాదించిన మొత్తంలో కొంత మొత్తాన్ని కారు కొనుగోలు చేసేందుకు, సుమారు 20 లక్షల్ని ఇతర అవసరాల కోసం వినియోగించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







