ఇథియోపియా:ప్రధాని ర్యాలీలో భారీ పేలుడు...
- June 23, 2018
అడిస్ అబబా: ఇథియోపియా నూతన ప్రధాని అబే అహ్మద్ నిర్వహించిన ర్యాలీలో భారీ పేలుడు చోటుచేసుకున్నది. అడిస్ అబబాలో జరిగిన ర్యాలీకి వేలాది మంది హాజరయ్యారు. ఆ సభలో పేలుడు జరగడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. ప్రసంగం పూర్తి కాగానే ప్రధాని అబే అహ్మద్ను సెక్యూర్టీ దళాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి. పేలుడులో అనేక మంది గాయపడినట్లు స్థానిక మీడియా ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మాజీ ప్రధాని హెయిలిమరియమ్ డిసలేన్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. దీంతో ఆయనకు వారసుడిగా అబే అహ్మద్ ఆ బాధ్యతలు స్వీకరించారు. దేశంలోని ఒరోమో తెగకు చెందిన మొదటి నేతగా అబే అహ్మద్ను గుర్తిస్తున్నారు. ఇథియోపియాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, రాజకీయ రెబల్స్ను వేధిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ర్యాలీలో జరిగిన పేలుడులో పలువురు చనిపోయినట్లు ఆ తర్వాత ప్రధాని ఓ ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







