ఖతార్: కష్టాల్లో అండగా నిలిచిన తెలంగాణ జాగృతి
- June 23, 2018
దోహా:ఖతార్లో తినడానికి తిండి లేక ఉండడానికి నీడ లేక తీవ్ర అవస్థలు పడుతున్న కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన 20 మంది బాధితులకు స్థానిక తెలంగాణా జాగృతి చేయూత నిచ్చింది. బాధితుల గురించి తెలుసుకున్న జాగృతి ఖతర్ నిర్వాహకురాలు నందిని అబ్బాగౌని వారిని కలిసి మాట్లాడారు. వారి బాధలు ప్రత్యక్షంగా చూసిన ఆమె తక్షణం స్పందించి వారానికి సరిపడా ఆహార పదార్థాలను సమకూర్చారు. బాధితులంతా ఏజెంట్ల మోసాలకు గురైనవారుగా సమాచారం. చేయడానికి పనిలేక, ఉండటానికి ఇళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరికి వీసా గడువు ముగిసింది. మరికొందరికి ఎగ్జిట్ పర్మిట్ లేదు. కొందరికి ఐడీ చెయ్యమంటే ఏజెంట్లు ఇంకా పైసలు అడుగడంతో ఖర్చులకు రూపాయి లేక.. ఇంటికి ఫోన్ చేయలేక సతమతమౌతున్నారు. జాగృతి ఖతర్ నాయకులు నందిని అబ్బగౌని, ప్రణీత కేతే, అశ్వినీ కోఠి, అనుపమ సంగిశెట్టి బాధితులకు ధైర్యం చెప్పారు. అక్కడి యాజమాన్యంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని చెప్పారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్,ప్రతినిధి)
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







