ఖతార్: కష్టాల్లో అండగా నిలిచిన తెలంగాణ జాగృతి
- June 23, 2018
దోహా:ఖతార్లో తినడానికి తిండి లేక ఉండడానికి నీడ లేక తీవ్ర అవస్థలు పడుతున్న కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన 20 మంది బాధితులకు స్థానిక తెలంగాణా జాగృతి చేయూత నిచ్చింది. బాధితుల గురించి తెలుసుకున్న జాగృతి ఖతర్ నిర్వాహకురాలు నందిని అబ్బాగౌని వారిని కలిసి మాట్లాడారు. వారి బాధలు ప్రత్యక్షంగా చూసిన ఆమె తక్షణం స్పందించి వారానికి సరిపడా ఆహార పదార్థాలను సమకూర్చారు. బాధితులంతా ఏజెంట్ల మోసాలకు గురైనవారుగా సమాచారం. చేయడానికి పనిలేక, ఉండటానికి ఇళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరికి వీసా గడువు ముగిసింది. మరికొందరికి ఎగ్జిట్ పర్మిట్ లేదు. కొందరికి ఐడీ చెయ్యమంటే ఏజెంట్లు ఇంకా పైసలు అడుగడంతో ఖర్చులకు రూపాయి లేక.. ఇంటికి ఫోన్ చేయలేక సతమతమౌతున్నారు. జాగృతి ఖతర్ నాయకులు నందిని అబ్బగౌని, ప్రణీత కేతే, అశ్వినీ కోఠి, అనుపమ సంగిశెట్టి బాధితులకు ధైర్యం చెప్పారు. అక్కడి యాజమాన్యంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని చెప్పారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్,ప్రతినిధి)
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







