ఈనెల 25న హైదరాబాద్లో పీసీసీ కార్యవర్గం సమావేశం..
- June 23, 2018
తెలంగాణలో అధికారం చేజిక్కుంచుకోవడంపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఏఐసీసీ సంస్ధాగత ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్, తెలంగాణ ఇంఛార్జ్ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. నాలుగున్నర గంటలు సమావేశం సాగింది. కొత్తగా నియమించిన ముగ్గురు కార్యదర్శులకు 40 నియోజవర్గాలు కేటాయించారు. ఎన్నికల టైంలో అభ్యర్థుల ఎంపిక వంటి ప్రత్యేక అధికారాలు ఉంటాయి. 90 రోజులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి జిల్లా, బ్లాక్, మండల స్థాయిల్లో సమావేశాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది ఎలక్షన్లు జరిగే రాష్ట్రాలకే ఎన్నికల కమిటీలు నియమించారని.. తెలంగాణలో లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
పీసీసీ అధ్యక్షుడిని మార్చే ప్రసక్తే లేదని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టంచేసింది. పార్టీలోని కుమ్ములాటలు, దానం జంపింగ్పైన వార్రూమ్లో చర్చించారు. నాయకులు వెళ్తున్నా.. 10శాతం ఓటు బ్యాంక్ పెరిగిందని కుంతియా అన్నారు. డిసెంబర్లో ముందస్తు ఎన్నికలొచ్చినా కేడర్ని సిద్ధం చేయడమే కర్తవ్యమన్నారు. ఈనెల 25న హైదరాబాద్లో పీసీసీ కార్యవర్గం, జిల్లా అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి యాక్షన్ ప్లాన్ అమలు కానుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







