ఉగ్రవాద సంస్థకు భారీ దెబ్బ
- June 24, 2018
భారత భద్రతాదళాలు.. లష్కరే తొయబా ఉగ్రవాద సంస్థను భారీగా దెబ్బతీశాయి. కుల్గాంలో జరిగిన ఎన్కౌంటర్లో భారత బలగాలు ఇద్దరు లష్కరే ఉగ్రవాదులను కాల్చిచంపగా, వీరిలో ఒకరిని లష్కరే తొయిబా కమాండర్ షకూర్గా గుర్తించినట్టు సమాచారం. 2015 నుంచి కశ్మీర్లో చురుకుగా పనిచేస్తున్న షకూర్ రాష్ట్రంలో పలు ఉగ్రవాద దాడుల ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టు ఉన్నతాధికార వర్గాల సమాచారం.
దక్షిణ కశ్మీర్లోని కుల్గాంలో మధ్యాహ్నం ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. చద్దర్ ప్రాంతంలో గస్తీ బృందంపై ఉగ్రవాదులు దాడిచేయడంతో భధ్రతా దళాలు ఎదురుదాడికి దిగాయి. ఎన్కౌంటర్ కారణంగా కుల్గాం జిల్లాలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లే రహదారిలో కుల్గాం ఉండడంతో.. భద్రతాదళాలు ఇంకాస్త అప్రమత్తమయ్యాయి.
మొదట కుల్గాం ప్రాంతంలో మొత్తం ముగ్గరు ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారం భద్రతా దళాలకు చేరింది. దీంతో ఉదయం 1 రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్, సీఆర్పీఎఫ్, జమ్ముకశ్మీర్ పోలీసులకు చెందిన ఎస్వోజీ బృందాలు రంగంలోకి దిగాయి. కుల్గాం జిల్లాలోని క్యూమోహ్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టాయి. ఈ ఎన్కౌంటర్లోనే లష్కరేకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా.. మూడో ఉగ్రవాది ఆయుధాలు, మందుగుండు సామగ్రితో సహా లొంగిపోయాడు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









