సౌదీ అరేబియా :తండ్రిని హతమార్చిన కేసులో దోషికి మరణ శిక్ష
- June 26, 2018
సౌదీ అరేబియా :తండ్రిని సజీవ దహనం చేసిన వ్యక్తికి మరణ శిక్ష విధించినట్లు సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. సౌదీ జాతీయుడైన మనాహి అల్ బురూక్ అల్ బిషి, అతని తండ్రిపై గ్యాసోలైన్ని పోసి నిప్పంటించాడు. నిద్రిస్తున్న తండ్రి, ఆ నిద్రలోనే హాహాకారాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతనే ఈ ఘటనకు పాల్పడినట్లు నిర్ధారించారు. సుప్రీంకోర్టుకి నిందితుడ్ని తరలించగా, అక్కడా అతనే నేరం చేసినట్లు రుజువయ్యింది. ఈ నేపథ్యంలో నిందితుడికి మరణ శిక్ష విధించడమయ్యింది. ఈ నేపథ్యంలో నిందితుడికి న్యాయస్థానం విధించిన మరణ శిక్షను అమలుపరిచారు. ఇలాంటి తీవ్రమైన నేరాలకు ఉరిశిక్ష విధించడం ద్వారా చెక్ పెట్టగలమని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







