అత్యాధునిక సౌకర్యాలతో మ్యూజియం ప్రారంభం
- December 11, 2015
అత్యాధునిక సౌకర్యాలతో ఒమన్లో నేషనల్ మ్యూజియంను ప్రారంభించనున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ అండ్ కల్చర్ నేషనల్ మ్యూజియం డైరెక్టర్ జమాల్ బిన్ హసన్ అల్ మౌస్సావి మాట్లాడుతూ, అత్యున్నతస్థాయి సౌకర్యాలతో ఈ మ్యూజియం ప్రారంభం కానున్నట్లు చెప్పారు. అంధులకు వీలుగా బ్రెయిలీ సింబల్స్ కూడా ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఒమన్కి చెందిన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక సాంస్కృతిక విషయాలు ఈ మ్యూజియం ద్వారా ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా మ్యూజియంను తీర్చిదిద్దారు. ఈ మ్యూజియంలో యుహెచ్డి సినిమా థియేటర్ని కూడా ఏర్పాటు చేశారు. ఒమన్లో ఇదే తొలి యుహెచ్డి సినిమా థియేటర్. 12 నిమిషాల ప్రెజెంటేషన్ ఈ థియేటర్లో ఉంటుంది. ఆరు వేలకు పైగా కళాఖండాలు ఈ మ్యూజియంలో పొందుపర్చబడ్డాయి. పురాతనకాలం నాటి ఆయుధాలు, షిప్లు, చారిత్రక నిర్మాణాలకు సంబంధించిన మోడల్స్ ఈ మ్యూజియంలో దర్శనమిస్తాయి. వచ్చే సోమవారం ఈ మ్యూజియంను ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









