అత్యాధునిక సౌకర్యాలతో మ్యూజియం ప్రారంభం
- December 11, 2015
అత్యాధునిక సౌకర్యాలతో ఒమన్లో నేషనల్ మ్యూజియంను ప్రారంభించనున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ అండ్ కల్చర్ నేషనల్ మ్యూజియం డైరెక్టర్ జమాల్ బిన్ హసన్ అల్ మౌస్సావి మాట్లాడుతూ, అత్యున్నతస్థాయి సౌకర్యాలతో ఈ మ్యూజియం ప్రారంభం కానున్నట్లు చెప్పారు. అంధులకు వీలుగా బ్రెయిలీ సింబల్స్ కూడా ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఒమన్కి చెందిన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక సాంస్కృతిక విషయాలు ఈ మ్యూజియం ద్వారా ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా మ్యూజియంను తీర్చిదిద్దారు. ఈ మ్యూజియంలో యుహెచ్డి సినిమా థియేటర్ని కూడా ఏర్పాటు చేశారు. ఒమన్లో ఇదే తొలి యుహెచ్డి సినిమా థియేటర్. 12 నిమిషాల ప్రెజెంటేషన్ ఈ థియేటర్లో ఉంటుంది. ఆరు వేలకు పైగా కళాఖండాలు ఈ మ్యూజియంలో పొందుపర్చబడ్డాయి. పురాతనకాలం నాటి ఆయుధాలు, షిప్లు, చారిత్రక నిర్మాణాలకు సంబంధించిన మోడల్స్ ఈ మ్యూజియంలో దర్శనమిస్తాయి. వచ్చే సోమవారం ఈ మ్యూజియంను ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!
- తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభించిన ముంబై నేవీ
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన మూడు ఇరానీ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్లో అమెరికా దాడులు.. ఏడుగురు సైనికులు మృతి
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు







