మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలి: ప్రిన్సెస్ సబీకా
- December 11, 2015
అంతర్జాతీయ అత్యున్నత కాన్ఫరెన్స్ 'విమెన్ ఇన్ పబ్లిక్ లైఫ్: ఫ్రమ్ పాలసీస్ టు ఇంపాక్ట్' పేరుతో జరిగింది. ప్రిన్సెస్ సబీకా బింట్ ఇబ్రహీమ్ అల్ ఖలీఫా నేతృత్వంలో జరిగిన ఈ కాన్ఫరెన్స్ మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలని అభిప్రాయపడింది. మూడు రోజులపాటు జరిగిన ఈ కాన్ఫరెన్స్ని సుప్రీం కౌన్సిల్ ఫర్ విమెన్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ డెవలప్మెంట్ (ఓఇసిడి) సహకారంతో చేపట్టింది. జాతీయ స్థాయిలో మహిళలకు పురుషులతో సరిసమానంగా అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలని కాన్ఫరెన్స్లో వక్తలు అభిప్రాయపడ్డారు. అరబ్ దేశాల్లో మహిళలు, వారికి అన్ని రంగాల్లో మరిన్ని అవకాశాలు కల్పించడంపై విస్తృతమైన చర్చ జరిగింది. ప్రభుత్వ సెక్టార్లు, ప్రైవేటు సెక్టార్లూ దీనికోసం ముందుకు రావాలని వక్తలు ఆకాంక్షించారు. 2014నివేదిక ప్రకారం బహ్రెయిన్లో అత్యధిక శాతం మహిళలు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా ఉన్నత స్థానంలో తమ ఉనికిని చాటుకుంటున్నారు. పబ్లిక్ సెక్టార్లో ఎడ్మినిస్ట్రేటివ్ విభాగంలో సీనియర్ పొజిషన్లో సుమారు 45 శాతం మంది మహిళలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మిడిల్ మేనేజ్మెంట్ పొజిషన్లో 59 శాతం ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









