మిడ్‌ డే బ్రేక్‌ రూల్‌ఉల్లంఘన: 251 కంపెనీలకు నోటీసులు

- July 02, 2018 , by Maagulf
మిడ్‌ డే బ్రేక్‌ రూల్‌ఉల్లంఘన: 251 కంపెనీలకు నోటీసులు

మస్కట్‌: మిడ్‌ డే బ్రేక్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్న 251 కంపెనీలను మినిస్ట్రీ ఆఫ్‌ మ్యాన్‌ పవర్‌ గుర్తించింది. మినిస్ట్రీ 1,003 కంపెనీలను సందర్శించగా, 251 కంపెనీలు ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయనీ, 752 కంపెనీలు నిబంధనల్ని పాటిస్తున్నాయని అధికారులు తెలిపారు. జూన్‌ 1 నుంచి ఆగస్ట్‌ వరకు మిడ్‌ డే బ్రేక్‌ రూల్‌ అమల్లో వుంటుంది. మధ్యాహ్నం 12.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3.30 నిమిషాల వరకు ఎండ వేడిలో పని చేయడానికి కార్మికుల్ని అనుమతించకూడదు. ఆర్టికల్‌ 118 ఒమన్‌ చట్టం ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడే కంపెనీలకు జరీమానా, జైలు శిక్ష విధించే అవకాశం వుంది. 100 నుంచి 500 ఒమన్‌ రియాల్స్‌ వరకూ జరీమానా, నెల రోజుల జైలు శిక్ష విధిస్తారు. ఇదే నేరం రిపీట్‌ అయితే, శిక్ష డబుల్‌ అవుతుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com