ట్రూకాలర్ ప్రో సబ్స్క్రయిబర్స్ కోసం స్పెషల్ ఆఫర్
- July 02, 2018
స్మార్ట్ ఫోన్ యూజర్ల ఫేవరట్ గా నిలిచిన ట్రూకాలర్, ఇప్పుడు తన ప్రో సబ్ స్క్రయిబర్స్ కోసం సరికొత్త సర్వీసును అందిస్తోంది. ముఖ్యంగా తన ప్రో సబ్స్క్రయిబర్స్ కోసం " హూ వ్యూడ్ యువర్ ప్రొఫైల్ " పేరిట సరికొత్త ఫీచర్ ను ప్రవేశపెడుతోంది. దీని ద్వారా ట్రూకాలర్ ద్వారా మీ ప్రొఫైల్ ఎవరు పరిశీలించారో ఇట్టే తెలుసుకోవచ్చు. తద్వారా మీకు ఎవరి నుంచి కాల్ రానుందో ముందే తెలుసుకునే అవకాశం ఉంది.
ఇది ఎలా పనిచేస్తుంది...ట్రూ కాలర్ ప్రో యూజర్స్ కు ముందుగా ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఎవరైన మీ కాంటాక్ట్ ప్రొఫైల్ ను చెక్ చేసినా, లేదా కాల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాంటాక్ట్ పర్సన్ యాప్ తో షేర్ చేసుకున్న డీటైల్స్ని బట్టి మీరు పొందే అవకాశం ఉంది. అలాగే నోటిఫికేషన్ ద్వారా మాత్రమే కాదు సెట్టింగ్స్ లోని ప్రైవసీ సెంటర్ లోకి వెళ్లి కూడా మీ ప్రొఫైల్ లో ఎవరు తొంగి చూస్తున్నారో పరిశీలించవచ్చు.
ప్రైవేట్ మోడ్..
ప్రో యూజర్లకు మరో అవకాశం ఉంది. ప్రైవేట్ మోడ్ ద్వారా మీరు ఒక వేళ వేరే వ్యక్తి ప్రొఫైల్ ను చూసినట్లయితే మీ డిటైల్స్ ను షేర్ చేయకుండా ఉండటం కూడా ప్రైవేట్ మోడ్ ద్వారా ప్రో యూజర్లకు అందిస్తున్నారు.త్వరలో విడుదల కానున్న ఈ ఫీచర్ ద్వారా ప్రోయూజర్ల సంఖ్య పెంచుకునే దిశలో ట్రూకాలర్ పనిచేస్తుంది. ప్రో ఫీచర్ ను ఇకపై ప్రీమియం ఫీచర్ గా పిలువనున్నారు. ప్రో ఫీచర్ లో మరింత సెక్యూర్ గానూ, సేఫ్టీతోనూ ఫీచర్లను అందిస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే కంపెనీ నుంచి మల్టీ బ్యాంక్ పేమెంట్స్ యాప్ సర్వీసులు కూడా ప్రారంభం అయ్యాయి. చిల్లర్ పేరిట ఉన్న యాప్ ను ఈ మధ్య కాలంలోనే కొనుగోలు చేశారు.ట్రూకాలర్ పే 2017లో లాంచ్ అయినప్పటి నుంచి యూజర్ల సంఖ్య క్రమంగా పెరిగినట్లు కంపెనీ సీఎస్ఓ నామి జరిగలం తెలిపారు. బెంగుళూరులో కంపెనీ డెవలప్ మెంట్ సెంటర్ లో మరిన్ని మార్పులతో ట్రూకాలర్ రూపుదిద్దుకోవడం గమనార్హం.
తాజా వార్తలు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం







