దాహం... దాహం... ఎందుకు? చల్లటి మజ్జిగతో.....
- July 06, 2018
మనిషి శరీరంలో నుండి ఒక రోజులో 700 నుండి 1000 గ్రాముల నీరు చెమట రూపంలో బయటకు పోతుంటుంది. అదే సమయంలో శరీరంలోపల 300 నుండి 400 గ్రాముల నీరు తయారవుతూ ఉంటుంది. అంటే మన శరీరంలో బయటకుపోయే నీరు శాతమే ఎక్కువ. ఇలా నీటి శాతం తగ్గినప్పుడు దాహం వేస్తుంది. రక్తంలో ఉప్పు, నీరు కలిసి ఉంటాయి.
మమూలుగా ఇవి రెండు రక్తంలో స్థిరంగానే ఉంటాయి. ఏ కారణం చేతనయినా రక్తంలో నీటి శాతం తగ్గినట్లైతే దాహం వేస్తుంది. కొందరికైతే వేసవికాలం, వర్షాకాలం అనే తేడాలు లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు దాహం వేస్తుంటుంది. వారికి ఎన్ని నీళ్లు త్రాగినా దాహం తీరదు. ఎటువంటి వారికైనా దాహం వేస్తుంటే గ్లాసు చల్లని నీటిలో 4 స్పూన్ల చక్కెర, నిమ్మరసం కలుపుకుని త్రాగితే వెంటనే దాహం తగ్గుతుంది.
అదేవిధంగా దానిమ్మ పండ్ల రసానికి సమంగా పంచదార కలిపి తేనె పాకంగా ఉడికించి 2 స్పూన్స్ రోజుకి మూడుసార్లు త్రాగితే దాహం తగ్గుతుంది. మెరుగు అన్నంలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఉప్పు కలిపి తీసుకుంటే త్వరగా దాహం తగ్గి వడదెబ్బ నుంచి విముక్తి కలుగుతుంది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







