థాయ్లాండ్:బోటు బోల్తా 37 మంది మృతి
- July 06, 2018
ఫుకెట్: పర్యాటకులకు స్వర్గధామమైన థాయ్లాండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫుకెట్ దీవికి సమీపంలో 105 మందితో గురువారం సముద్రంలోకి వెళ్లిన బోటు బోల్తా కొట్టడంతో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో దాదాపు 50 మంది పర్యాటకుల్ని అధికారులు రక్షించగలిగారు. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి 16 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడటంతో ఫీనిక్స్ అనే బోటు గురువారం పల్టీ కొట్టిందని ఫుకెట్ విపత్తు నిర్వహణ సంస్థ ఉన్నతాధికారి తెలిపారు. అలలు ఎగిసిపడే అవకాశముందని హెచ్చరించినప్పటికీ బోటు యజమాని, కెప్టెన్ తమ సూచనల్ని పెడచెవిన పెట్టారని వెల్లడించారు. ఈ ప్రమాదంలో చనిపోయినవారంతా చైనీయులే.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







