థాయ్లాండ్:బోటు బోల్తా 37 మంది మృతి
- July 06, 2018ఫుకెట్: పర్యాటకులకు స్వర్గధామమైన థాయ్లాండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫుకెట్ దీవికి సమీపంలో 105 మందితో గురువారం సముద్రంలోకి వెళ్లిన బోటు బోల్తా కొట్టడంతో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో దాదాపు 50 మంది పర్యాటకుల్ని అధికారులు రక్షించగలిగారు. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి 16 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడటంతో ఫీనిక్స్ అనే బోటు గురువారం పల్టీ కొట్టిందని ఫుకెట్ విపత్తు నిర్వహణ సంస్థ ఉన్నతాధికారి తెలిపారు. అలలు ఎగిసిపడే అవకాశముందని హెచ్చరించినప్పటికీ బోటు యజమాని, కెప్టెన్ తమ సూచనల్ని పెడచెవిన పెట్టారని వెల్లడించారు. ఈ ప్రమాదంలో చనిపోయినవారంతా చైనీయులే.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు