ఈజిప్ట్ విమాన దుర్ఘటనకు కాక్పిట్ అగ్నిప్రమాదము కారణం
- July 07, 2018
కైరో:రెండేళ్ళ క్రితం పారిస్-కైరో ఈజిప్ట్ ఎయిర్కి చెందిన విమానం కూలిపోవడానికి కాక్పిట్లో సంభవించిన అగ్ని ప్రమాదమే కారణమై వుండవచ్చని ఫ్రాన్స్ దర్యాప్తు అధికారులు తెలిపారు. 2016 మే లో సంభవించిన ఈ దుర్ఘటనలో విమానంలో వున్న 66మందీ చనిపోయారు. వీరిలో 12మంది ఫ్రాన్స్ జాతీయులు వున్నారు. ఈ విమానం కూలిపోవడానికి విద్రోహక చర్య కారణమై వుండవచ్చని, మృతదేహాల అవశేషాల్లో పేలుడు రసాయనాలు కనుగొన్నామని ఈజిప్ట్ అధికారులు నిర్ధారించారు. ఆ దర్యాప్తు నిర్ధారణలను తిరస్కరిస్తూ ఫ్రాన్స్కి చెందిన బిఇఎ ఎయిర్ యాక్సిడెంట్ దర్యాప్తు సంస్థ పై వివరాలతో ఒక ప్రకటన జారీ చేసింది. చాలా ఎత్తులో వుండగా, కాక్పిట్లో మంటలు చెలరేగి వుండవచ్చని, దానితో మొత్తంగా విమానమంతా మంటలు వ్యాపించి వుంటాయని భావిస్తున్నామని బిఇఎ పేర్కొంది. అయితే, ఈజిప్ట్ అధికారులు తమ తుది నివేదికను ప్రచురించలేదని, విమాన శిధిలాలపై మరింతగా దర్యాప్తు సాగించాలన్న తమ ప్రతిపాదన కూడా వారు పట్టించుకోలేదని బిఇఎ తెలిపింది. కాగా దీనిపై వెంటనే వ్యాఖ్యానించడానికి ఈజిప్ట్ ఎయిర్ అధికారులు అందుబాటులోకి రాలేదు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వుండాలంటే ఈ దుర్ఘటనకు గల కారణాలు విశ్లేషించి చర్యలు తీసుకోవాల్సి వుందని బిఇఎ.
తాజా వార్తలు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!







