ఈజిప్ట్ విమాన దుర్ఘటనకు కాక్పిట్ అగ్నిప్రమాదము కారణం
- July 07, 2018
కైరో:రెండేళ్ళ క్రితం పారిస్-కైరో ఈజిప్ట్ ఎయిర్కి చెందిన విమానం కూలిపోవడానికి కాక్పిట్లో సంభవించిన అగ్ని ప్రమాదమే కారణమై వుండవచ్చని ఫ్రాన్స్ దర్యాప్తు అధికారులు తెలిపారు. 2016 మే లో సంభవించిన ఈ దుర్ఘటనలో విమానంలో వున్న 66మందీ చనిపోయారు. వీరిలో 12మంది ఫ్రాన్స్ జాతీయులు వున్నారు. ఈ విమానం కూలిపోవడానికి విద్రోహక చర్య కారణమై వుండవచ్చని, మృతదేహాల అవశేషాల్లో పేలుడు రసాయనాలు కనుగొన్నామని ఈజిప్ట్ అధికారులు నిర్ధారించారు. ఆ దర్యాప్తు నిర్ధారణలను తిరస్కరిస్తూ ఫ్రాన్స్కి చెందిన బిఇఎ ఎయిర్ యాక్సిడెంట్ దర్యాప్తు సంస్థ పై వివరాలతో ఒక ప్రకటన జారీ చేసింది. చాలా ఎత్తులో వుండగా, కాక్పిట్లో మంటలు చెలరేగి వుండవచ్చని, దానితో మొత్తంగా విమానమంతా మంటలు వ్యాపించి వుంటాయని భావిస్తున్నామని బిఇఎ పేర్కొంది. అయితే, ఈజిప్ట్ అధికారులు తమ తుది నివేదికను ప్రచురించలేదని, విమాన శిధిలాలపై మరింతగా దర్యాప్తు సాగించాలన్న తమ ప్రతిపాదన కూడా వారు పట్టించుకోలేదని బిఇఎ తెలిపింది. కాగా దీనిపై వెంటనే వ్యాఖ్యానించడానికి ఈజిప్ట్ ఎయిర్ అధికారులు అందుబాటులోకి రాలేదు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వుండాలంటే ఈ దుర్ఘటనకు గల కారణాలు విశ్లేషించి చర్యలు తీసుకోవాల్సి వుందని బిఇఎ.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







