పెద్దఎత్తున గల్ఫ్ దేశాల నుండి భారత్ కు డబ్బు
- July 09, 2018
డాలర్తో రూపాయి విలువ మరింత క్షీణించే అవకాశం ఉందన్న వార్తలు దేశప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే గల్ఫ్ లోని భారతీయులు మాత్రం పండుగ చేసుకొంటున్నారు. డాలర్ కి అధిక మారక రేటు వస్తుండటంతో పెద్ద ఎత్తున తమ డబ్బుని స్వదేశంలోని తమ కుటుంబాలకి పంపుతున్నారు. గత పదిహేను రోజులుగా గల్ఫ్ దేశాల నుంచి భారత్ కు పంపే డబ్బులో హఠాత్తుగా 20-30 శాతం పెరుగుదల ఉన్నట్టు మనీ ఎక్స్చేంజ్ సంస్థలు చెబుతున్నాయి.
ప్రవాస తెలుగువారు రూపాయి పతనాన్ని పూర్తిగా వాడేసుకుంటున్నారు. డాలర్ల రూపంలోని తమ డబ్బును ప్రవాహంలా సొంతవారికి పంపుతున్నారు. తమ దగ్గరున్న మొత్తానికి మారకంలో కొన్ని రెట్ల మొత్తం పెరుగుతుండటంతో వారు అందినచోటల్లా డబ్బు తెచ్చి కుటుంబాలకు ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. ఏడాదంతా కష్టపడి పొదుపు చేసిన మొత్తాన్ని ఒకేసారి ఇంటికి పంపినవారు కొందరైతే దుబాయ్ లోని మరికొందరు తెలుగువారు తమ ఆఫీసుల్లో అడ్వాన్సులు, లోన్ల పేరిట డబ్బు తీసుకొని మరీ భారత్ కు తరలిస్తున్నారు. దుబాయ్, అబుదాబీ, సౌదీ అరేబియా.. అన్ని గల్ఫ్ దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలిసింది.
తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







