పెద్దఎత్తున గల్ఫ్ దేశాల నుండి భారత్ కు డబ్బు
- July 09, 2018
డాలర్తో రూపాయి విలువ మరింత క్షీణించే అవకాశం ఉందన్న వార్తలు దేశప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే గల్ఫ్ లోని భారతీయులు మాత్రం పండుగ చేసుకొంటున్నారు. డాలర్ కి అధిక మారక రేటు వస్తుండటంతో పెద్ద ఎత్తున తమ డబ్బుని స్వదేశంలోని తమ కుటుంబాలకి పంపుతున్నారు. గత పదిహేను రోజులుగా గల్ఫ్ దేశాల నుంచి భారత్ కు పంపే డబ్బులో హఠాత్తుగా 20-30 శాతం పెరుగుదల ఉన్నట్టు మనీ ఎక్స్చేంజ్ సంస్థలు చెబుతున్నాయి.
ప్రవాస తెలుగువారు రూపాయి పతనాన్ని పూర్తిగా వాడేసుకుంటున్నారు. డాలర్ల రూపంలోని తమ డబ్బును ప్రవాహంలా సొంతవారికి పంపుతున్నారు. తమ దగ్గరున్న మొత్తానికి మారకంలో కొన్ని రెట్ల మొత్తం పెరుగుతుండటంతో వారు అందినచోటల్లా డబ్బు తెచ్చి కుటుంబాలకు ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. ఏడాదంతా కష్టపడి పొదుపు చేసిన మొత్తాన్ని ఒకేసారి ఇంటికి పంపినవారు కొందరైతే దుబాయ్ లోని మరికొందరు తెలుగువారు తమ ఆఫీసుల్లో అడ్వాన్సులు, లోన్ల పేరిట డబ్బు తీసుకొని మరీ భారత్ కు తరలిస్తున్నారు. దుబాయ్, అబుదాబీ, సౌదీ అరేబియా.. అన్ని గల్ఫ్ దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలిసింది.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..