మిస్త్రీపై వేటు సరైనదే

- July 09, 2018 , by Maagulf
మిస్త్రీపై వేటు సరైనదే

తనను టాటా సన్స్‌ ఛైర్మన్‌గా తొలగించడాన్ని సవాలు చేస్తూ సైరస్ మిస్త్రీ వేసిన పిటీషన్‌ను నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యూనల్‌ కొట్టివేసింది. మిస్త్రీ తొలగించేందుకు టాటాసన్స్‌ బోర్డుకు పూర్తి అధికారం ఉందని తెలిపింది. ఈ కేసును ఎన్‌సీఎల్‌టీలో న్యాయమూర్తులు ప్రకాశ్‌కుమార్‌, సేనపతిల బెంచ్‌ విచారించింది. కంపెనీ బోర్డులో మెజారిటీ డైరెక్టర్ల మిస్త్రీ కోల్పోయారని ట్రైబ్యూనల్‌ పేర్కొంది. కీలకమైన సమచారాం ఇన్‌కమ్‌ ట్యాక్స్ అధికారులకు పంపడం, మీడియాకు లీక్‌ చేయడంతో పాటు నేరుగా మీడియాతో మాట్లాడటంతో డైరెక్టర్ల బోర్డు మిస్త్రీపై విశ్వాసం కోల్పోయిందని ట్రైబ్యూనల్‌ అభిప్రాయపడింది. ఎన్‌సీఎల్‌టీ తీర్పు తనకు ఆశ్చర్యం కల్గించలేదని మిస్త్రీ అన్నారు. మైనార్టి షేర్ హోల్డర్ల ప్రయోజనాలను ట్రైబ్యూనల్‌ పట్టించుకోలేదని ఆయన చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com