మిస్త్రీపై వేటు సరైనదే
- July 09, 2018
తనను టాటా సన్స్ ఛైర్మన్గా తొలగించడాన్ని సవాలు చేస్తూ సైరస్ మిస్త్రీ వేసిన పిటీషన్ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ కొట్టివేసింది. మిస్త్రీ తొలగించేందుకు టాటాసన్స్ బోర్డుకు పూర్తి అధికారం ఉందని తెలిపింది. ఈ కేసును ఎన్సీఎల్టీలో న్యాయమూర్తులు ప్రకాశ్కుమార్, సేనపతిల బెంచ్ విచారించింది. కంపెనీ బోర్డులో మెజారిటీ డైరెక్టర్ల మిస్త్రీ కోల్పోయారని ట్రైబ్యూనల్ పేర్కొంది. కీలకమైన సమచారాం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు పంపడం, మీడియాకు లీక్ చేయడంతో పాటు నేరుగా మీడియాతో మాట్లాడటంతో డైరెక్టర్ల బోర్డు మిస్త్రీపై విశ్వాసం కోల్పోయిందని ట్రైబ్యూనల్ అభిప్రాయపడింది. ఎన్సీఎల్టీ తీర్పు తనకు ఆశ్చర్యం కల్గించలేదని మిస్త్రీ అన్నారు. మైనార్టి షేర్ హోల్డర్ల ప్రయోజనాలను ట్రైబ్యూనల్ పట్టించుకోలేదని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత
- భారతీయ ప్రయాణికులకు ఎమిరేట్స్ గుడ్ న్యూస్..
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!







