థాయ్ ల్యాండ్:గుహ నుంచి బయటపడ్డ 8 మంది చిన్నారులు
- July 09, 2018
చియాంగ్ రాయ్ : థాయిలాండ్లోని థామ్ లాంగ్ గుహలో చిక్కుకున్న చిన్నారుల్ని రెస్క్యూ టీమ్ బయటకు తీసుకువస్తున్నది. ఆదివారం నలుగురు పిల్లల్ని బయటకు తీసిన డైవర్లు ఇవాళ మరో నలుగురు పిల్లల్ని బయటకు తీసుకువచ్చారు. దీంతో మొత్తం రెస్క్యూ చేసిన పిల్లల సంఖ్య ఎనిమిదికి చేరుకున్నది. జూన్ 23న గుహలో చిక్కుకున్న చిన్నారులను కాపాడేందుకు థాయ్ ప్రభుత్వం శతప్రయత్నాలు చేస్తోంది. 25 ఏళ్ల కోచ్తో సహ మొత్తం 13 మంది పిల్లలు గుహలో చిక్కుకున్న విషయం తెలిసిందే. థాయ్ల్యాండ్తో పాటు అంతర్జాతీయ డైవర్లు ఇవాళ ఆక్సిజన్ సిలెండర్లతో గుహలోకి ప్రవేశించారు. పిల్లల్ని బయటకు తీసుకురాగానే వాళ్లను మెడికల్ సెంటర్కు తరలిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







