థాయ్ ల్యాండ్:గుహ నుంచి బయటపడ్డ 8 మంది చిన్నారులు
- July 09, 2018
చియాంగ్ రాయ్ : థాయిలాండ్లోని థామ్ లాంగ్ గుహలో చిక్కుకున్న చిన్నారుల్ని రెస్క్యూ టీమ్ బయటకు తీసుకువస్తున్నది. ఆదివారం నలుగురు పిల్లల్ని బయటకు తీసిన డైవర్లు ఇవాళ మరో నలుగురు పిల్లల్ని బయటకు తీసుకువచ్చారు. దీంతో మొత్తం రెస్క్యూ చేసిన పిల్లల సంఖ్య ఎనిమిదికి చేరుకున్నది. జూన్ 23న గుహలో చిక్కుకున్న చిన్నారులను కాపాడేందుకు థాయ్ ప్రభుత్వం శతప్రయత్నాలు చేస్తోంది. 25 ఏళ్ల కోచ్తో సహ మొత్తం 13 మంది పిల్లలు గుహలో చిక్కుకున్న విషయం తెలిసిందే. థాయ్ల్యాండ్తో పాటు అంతర్జాతీయ డైవర్లు ఇవాళ ఆక్సిజన్ సిలెండర్లతో గుహలోకి ప్రవేశించారు. పిల్లల్ని బయటకు తీసుకురాగానే వాళ్లను మెడికల్ సెంటర్కు తరలిస్తున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!