బహ్రెయిన్:పిల్లల తప్పిదం.. పెద్దలకు జరీమానా!

- July 09, 2018 , by Maagulf
బహ్రెయిన్:పిల్లల తప్పిదం.. పెద్దలకు జరీమానా!

బహ్రెయిన్:పబ్లిక్‌ పార్కులు, గార్డెన్స్‌లో ఇకపై పిల్లలు అక్కడి పరిసరాల్ని, వసతుల్ని డ్యామేజ్‌ చేస్తే వారి తల్లిదండ్రులు జరీమానా చెల్లించాల్సి రావొచ్చు. ఈ మేరకు నిబంధనల్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముహర్రాక్‌ మునిసిపల్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ మొహమ్మద్‌ అల్‌ సినాన్‌ మాట్లాడుతూ, పిల్లలు డ్యామేజ్‌ చేస్తే పెద్దలకు విధించే జరీమానా 50 దినార్స్‌ పైనే వుండేలా సమాలోచనలు చేస్తున్నామని చెప్పారు. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, డ్యామేజ్‌లకు పాల్పడే చిన్నారుల్ని గుర్తించాలన్నది తమ ప్లాన్‌ అని ఆయన వివరించారు. పిల్లలు, వసతుల్ని పాడు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన తల్లిదండ్రులు కొంత ఉదాసీనంగా వ్యవహరించడంతో పెద్దయెత్తున అక్కడ వసతులకు నష్టం కలుగుతోందనీ, తద్వారా అనవసరంగా అదనపు నిధులు వెచ్చించి వాటిని బాగు చేయాల్సి వస్తోందని నార్తరన్‌ మునిసిపల్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ మొహమ్మద్‌ బౌహ్‌హౌద్‌ అభిప్రాయపడ్డారు. ఈ ప్రపోజల్‌కి పౌరుల నుంచీ మద్దతు లభిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com