బహ్రెయిన్:పిల్లల తప్పిదం.. పెద్దలకు జరీమానా!
- July 09, 2018
బహ్రెయిన్:పబ్లిక్ పార్కులు, గార్డెన్స్లో ఇకపై పిల్లలు అక్కడి పరిసరాల్ని, వసతుల్ని డ్యామేజ్ చేస్తే వారి తల్లిదండ్రులు జరీమానా చెల్లించాల్సి రావొచ్చు. ఈ మేరకు నిబంధనల్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముహర్రాక్ మునిసిపల్ కౌన్సిల్ ఛైర్మన్ మొహమ్మద్ అల్ సినాన్ మాట్లాడుతూ, పిల్లలు డ్యామేజ్ చేస్తే పెద్దలకు విధించే జరీమానా 50 దినార్స్ పైనే వుండేలా సమాలోచనలు చేస్తున్నామని చెప్పారు. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, డ్యామేజ్లకు పాల్పడే చిన్నారుల్ని గుర్తించాలన్నది తమ ప్లాన్ అని ఆయన వివరించారు. పిల్లలు, వసతుల్ని పాడు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన తల్లిదండ్రులు కొంత ఉదాసీనంగా వ్యవహరించడంతో పెద్దయెత్తున అక్కడ వసతులకు నష్టం కలుగుతోందనీ, తద్వారా అనవసరంగా అదనపు నిధులు వెచ్చించి వాటిని బాగు చేయాల్సి వస్తోందని నార్తరన్ మునిసిపల్ కౌన్సిల్ ఛైర్మన్ మొహమ్మద్ బౌహ్హౌద్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రపోజల్కి పౌరుల నుంచీ మద్దతు లభిస్తోంది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు







