బహ్రెయిన్:పిల్లల తప్పిదం.. పెద్దలకు జరీమానా!
- July 09, 2018
బహ్రెయిన్:పబ్లిక్ పార్కులు, గార్డెన్స్లో ఇకపై పిల్లలు అక్కడి పరిసరాల్ని, వసతుల్ని డ్యామేజ్ చేస్తే వారి తల్లిదండ్రులు జరీమానా చెల్లించాల్సి రావొచ్చు. ఈ మేరకు నిబంధనల్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముహర్రాక్ మునిసిపల్ కౌన్సిల్ ఛైర్మన్ మొహమ్మద్ అల్ సినాన్ మాట్లాడుతూ, పిల్లలు డ్యామేజ్ చేస్తే పెద్దలకు విధించే జరీమానా 50 దినార్స్ పైనే వుండేలా సమాలోచనలు చేస్తున్నామని చెప్పారు. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, డ్యామేజ్లకు పాల్పడే చిన్నారుల్ని గుర్తించాలన్నది తమ ప్లాన్ అని ఆయన వివరించారు. పిల్లలు, వసతుల్ని పాడు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన తల్లిదండ్రులు కొంత ఉదాసీనంగా వ్యవహరించడంతో పెద్దయెత్తున అక్కడ వసతులకు నష్టం కలుగుతోందనీ, తద్వారా అనవసరంగా అదనపు నిధులు వెచ్చించి వాటిని బాగు చేయాల్సి వస్తోందని నార్తరన్ మునిసిపల్ కౌన్సిల్ ఛైర్మన్ మొహమ్మద్ బౌహ్హౌద్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రపోజల్కి పౌరుల నుంచీ మద్దతు లభిస్తోంది.
తాజా వార్తలు
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..







