ముగ్గురు యంగ్ హీరోల మల్టీస్టారర్
- July 09, 2018
ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తోంది. గత నాలుగైదేళ్లుగా ఇద్దరు పెద్ద హీరోలు కలిసి నటిస్తోన్న సినిమాలు వచ్చి సక్సెస్ అవుతున్నాయి. ఈ లిస్టులో అగ్రహీరోలు వెంకటేష్, నాగార్జున ముందు ఉంటారు. వీరు తమ తోటి స్టార్ యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ మిగిలిన వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక ప్రస్తుతం నాగార్జున - నాని హీరోగా కూడా ఓ మల్టీస్టారర్ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ప్రస్తుతం యువ హీరోలు కూడా వీరి బాటలోనే నడుస్తున్నారు. యువ హీరోల్లో ఈ తరహా సినిమాల్లో నారా రోహిత్ , శ్రీ విష్ణులు నటిస్తుంటారు. ఇక ఇప్పుడు వీరిద్దరితో కలిసి మరో హీరో సుధీర్ బాబు అలాగే సీనియర్ హీరోయిన్ శ్రీయలు ఒక చిత్రంలో నటిస్తున్నారు. నూతన దర్శకుడు ఇంద్రసేనా తెరకెక్కిస్తున్న చిత్రంలో వీళ్ళందరూ కలిసి నటిస్తున్నారు. బాబా క్రియేషన్స్ బ్యానర్పై బెల్లన అప్పారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







